రుషికొండపై అత్యంత ఇష్టంగా రూ.500 కోట్లతో నిర్మించుకున్న భవనంలోకి అడుగుపెట్టకుండగానే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోయారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఆదివారం మధ్యాహ్నం రుషికొండపై నిర్మించిన భవనాన్ని మీడియా ప్రతినిధులతో కలిసి వెళ్లి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500 కోట్ల రూపాయలతో అత్యంత రహస్యంగా ఈ భవన నిర్మాణాన్ని చేపట్టారన్నారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
రుషికొండపై అత్యంత ఇష్టంగా రూ.500 కోట్లతో నిర్మించుకున్న భవనంలోకి అడుగుపెట్టకుండగానే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోయారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఆదివారం మధ్యాహ్నం రుషికొండపై నిర్మించిన భవనాన్ని మీడియా ప్రతినిధులతో కలిసి వెళ్లి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500 కోట్ల రూపాయలతో అత్యంత రహస్యంగా ఈ భవన నిర్మాణాన్ని చేపట్టారన్నారు. రాజులు, సద్దాం హుస్సేన్, గాలి జనార్దన్ రెడ్డి వంటి వారు కట్టుకున్న రీతిలో ఈ భవన నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారన్నారు. ఇష్టంతో కట్టుకున్న ఈ భవనాన్ని చూడకుండానే జగన్మోహన్ రెడ్డి దిగిపోయారని, మూడో కంటికి తెలియకుండా పర్యాటక శాఖ మంత్రితో ప్రారంభోత్సవం చేయించేసారని ఆరోపించారు. ఏడు బ్లాకుల్లో ఈ నిర్మాణం సాగిందని, వీటికి పేర్లు కూడా రాజాస్థానాలు మాదిరిగా పెట్టారన్నారు. వైసీపీ నాయకులకి ఈ భవన నిర్మాణానికి సంబంధించిన పలు పనులను అప్పగించారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే రాజధాని ప్రాంతంలోని ప్రజా వేదికను కూల్చివేశారని, నిబంధనలకు విరుద్ధంగా కట్టడం వండడం వల్లే కూల్చివేసినట్లు నాడు జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు అన్నారు. మరి ఋషికొండపై కఠిన ఈ నిర్మాణానికి ఎటువంటి నిబంధనలు లేవని, ఈ నిర్మాణాన్ని ఏం చేయాలని గంట శ్రీనివాసరావు ప్రశ్నించారు. హైకోర్టు వేసిన నిపుణుల కమిటీ కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు తేల్చిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి ఈ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలని దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. హోటల్ గా వినియోగించుకునేందుకు కూడా అవకాశం లేకుండా భవనంలో నిర్మాణాలు సాగాయి అన్నారు. భవనంలో అత్యాధునికమైన హంగులను ఏర్పాటు చేశారని, గతంలో ఎక్కడో చూడని విధంగా ఈ భవనం ఉందన్నారు. ఏడాదికి ఎనిమిది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే రిసార్ట్స్ ను కూలగొట్టి మరి ఈ భవన నిర్మాణం చేపట్టడం దారుణం అన్నారు. విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పినప్పటికీ ఇక్కడ ప్రజలు వైసీపీ నాయకులను దారుణంగా ఓడించాలని, రాజధాని వద్దన్న సంకేతాలను ఇక్కడ ప్రజలు ఇచ్చారన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తించాలన్నారు. 2019 ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో తన అడ్డగోలు విధానాలు, నిర్ణయాలతో పాలనను బ్రష్టు పట్టించారన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనపై విసిగి చెందిన ప్రజలు తాజా ఎన్నికల్లో ఘోరమైన ఓటమి ఆయనకు చవి చూపించారన్నారు. తమ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను జగన్మోహన్ రెడ్డి విశ్లేషించుకోకుండా, ప్రజలపై నిందలు వేస్తున్నారని, ఇప్పటికీ ఆయనలో మార్పు రాకపోవడం గమనార్హం అన్నారు.