ఆర్థిక అసమానతలపై పరిశోధనలు.. ముగ్గురు అమెరికన్లకు దక్కిన నోబెల్ పురస్కారాలు

ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ఈ ఏడాది ముగ్గురిని వరించింది. సంపద విషయంలో దేశాల మధ్య అసమానతలపై చేసిన పరిశోధనలకుగాను అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు అసేమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్షన్లను నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిస్ అకాడమీ ప్రకటించింది. ఈ ముగ్గురికి నోబెల్ పురస్కారంతోపాటు రూ.8.90 కోట్ల రూపాయల నగదు బహుమతి దక్కనుంది.

Nobel Prize

నోబెల్ బహుమతి

ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ఈ ఏడాది ముగ్గురిని వరించింది. సంపద విషయంలో దేశాల మధ్య అసమానతలపై చేసిన పరిశోధనలకుగాను అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు అసేమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్షన్లను నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిస్ అకాడమీ ప్రకటించింది. ఈ ముగ్గురికి నోబెల్ పురస్కారంతోపాటు రూ.8.90 కోట్ల రూపాయల నగదు బహుమతి దక్కనుంది. ఒక దేశం ఆర్థికంగా ఎదగాలంటే సంస్థల ఏర్పాటు ప్రాముఖ్యతను అసేమోగ్లు, జాన్సన్, రాబిన్షన్ తమ పరిశోధనల్లో నొక్కి చెప్పారు. కొన్ని దేశాలు ఆర్థికంగా ఎందుకు విజయం సాధిస్తున్నాయి, కొన్ని దేశాలు ఎందుకు విఫలమవుతున్నాయి అనే అంశాలను కూడా తమ పరిశోధనలో భాగంగా విశదీకరించారు.

పేలవమైన చట్ట పాలన కలిగిన సమాజాలు, జనాభాను దోపిడీ చేసే సంస్థలు వృద్ధిని కానీ, సమాజంలో మార్పును కానీ సృష్టించలేవని ఎందుకు చెబుతారో అవార్డు గ్రహీతల పరిశోధన ద్వారా అర్థం చేసుకోవచ్చు అని రాయల్ స్విడిస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన నోబెల్ కమిటీ వెల్లడించింది. డారోన్ అసేమోగ్లు, సైమన్ జాన్సన్ అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పని చేస్తుండగా, రాబిన్షన్ చికాగో యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్నారు. అనేక దేశాల మధ్య ఆదాయాల్లో భారీ వ్యత్యాసాలను తగ్గించడం, ప్రస్తుతం ప్రపంచం ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా వీరు తమ పరిశోధనలో భాగంగా తేల్చారు. ఒక దేశం ఆర్థికంగా ఎదగాలంటే సామాజిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని అవార్డు గ్రహీతలు తెలియజేశారు. కాగా గతవారం వైద్య విభాగంలో మొదలైన నోబెల్ బహుమతుల ప్రకటన తాజా ఆర్థిక శాస్త్రంలో పరిశోధనలు సాగించిన వారికి ప్రకటించడం ద్వారా నోబెల్ బహుమతుల ప్రకటన ప్రక్రియ ముగిసినట్టు అయింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్