వెయ్యికి చేరిన మయన్మార్ భూకంప మృతుల సంఖ్య.. ఇంకా వేల మందికి తీవ్ర గాయాలు

మయన్మార్, థాయ్‌లాండ్‌లో మృతుల సంఖ్య 1,002కి చేరింది. భారీ భూకంపాలతో రెండు దేశాల్లో మృత్యు ఘోష వినిపిస్తోంది. అమెరికా సంస్థల అంచనా ప్రకారం.. మృతుల సంఖ్య 10 వేలకు మించి ఉండొచ్చని తెలుస్తోంది.

mayanmar earth quake deaths

వెయ్యికి చేరిన మయన్మార్ భూకంప మృతుల సంఖ్య

మయన్మార్, థాయ్‌లాండ్‌లో మృతుల సంఖ్య 1,002కి చేరింది. భారీ భూకంపాలతో రెండు దేశాల్లో మృత్యు ఘోష వినిపిస్తోంది. అమెరికా సంస్థల అంచనా ప్రకారం.. మృతుల సంఖ్య 10 వేలకు మించి ఉండొచ్చని తెలుస్తోంది. భూకంపం ధాటికి కుప్పకూలిన భవనాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. రెండు దేశాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపాలతో విలవిల్లాడిన రెండు దేశాలకు సాయంగా రష్యా, చైనా తమ సహాయక బృందాలను పంపించింది. భారత్ కూడా ఆపన్న హస్తం అందిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఆదేశాలతో మయన్మార్‌కు 15 టన్నుల సహాయ సామగ్రిని అధికారులు ఆ దేశానికి అందజేశారు. ఆపరేషన్ బర్మా పేరుతో సోలార్ ల్యాంప్స్, ఫుడ్ ప్యాకెట్లు, కిచెన్ సెట్స్ తదితర సామగ్రిని మయన్మార్‌కు చేరవేశారు.

అటు.. బ్యాంకాక్‌కు 990 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినా.. ఆ ప్రభావం బ్యాంకాక్ నగరంపై పడింది. ఆ నగరంలో చారిత్రక, ప్రముఖ భవనాలన్నీ నేలమట్టం అయ్యాయి. పలు వంతెనలు కూలిపోయాయి. ఇదిలా ఉండగా, మయన్మార్‌లో మరోసారి ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం అర్ధరాత్రి 4.2 తీవ్రతతో భూమి కంపించిందని అక్కడి అధికారులు వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్