భారత జట్టు స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఓకే క్యాలెండర్ ఇయర్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వయసున్న ఆటగాళ్లు జాబితాలో వేయి పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదు.
రోహిత్ శర్మ
భారత జట్టు స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఓకే క్యాలెండర్ ఇయర్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వయసున్న ఆటగాళ్లు జాబితాలో వేయి పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి 11 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ అభిమానులు నిరాశపరిచాడు. కానీ, ఒక అరుదైన రికార్డును మాత్రం తన పేరుతో లిఖించుకున్నాడు. ఈ ఏడాది వేయి పరుగులు పూర్తి చేసిన అత్యధిక వయసు కలిగిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. 2024 క్యాలెండర్ ఇయర్ లో మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 27 మ్యాచుల్లో 1000 ఒక పరుగులు చేశాడు. ఇందులో మూడు వన్డేల్లో 157 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 11 టీ20 మ్యాచుల్లో l 378 పరుగులు చేశాడు. ఏడు టెస్టుల్లో 466 పరుగులు చేశాడు.
ఈ క్రమంలోనే అత్యధిక వయసున్న కెప్టెన్ గా ఉంటూ క్యాలెండర్ ఇయర్ లో వేయికిపైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 37 ఏళ్ల 144 రోజులు. ఈ వయసులో ఈ స్థాయిలో పరుగులు చేయడం ద్వారా ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే ఓవరాల్ గా ఒకే సంవత్సరంలో వేయికిపైగా పరుగులు చేసిన జాబితాలో రోహిత్ శర్మ ఐదో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక బ్యాటర్ పాతున్ నిస్సంకా 24 మ్యాచ్ లో 1164 అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కుషాల్ మెండీస్ 33 మ్యాచ్ ల్లో 1161 పరుగులతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్ 1099 పరుగులతో మూడో స్థానంలో, కమింద్ 28 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రోహిత్ శర్మ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ కూడా మరో అరుదైన ఘనతను సాధించాడు. 10 టెస్టుల్లో వేయికిపైగా పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్ గా నిలిచాడు. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ పది టెస్టుల్లో 1094 పరుగులను పూర్తి చేశాడు.