భారీ వర్షాలు నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కీలక విజ్ఞప్తి.. ఇళ్లల్లోనే ఉండాలని హితవు

రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొద్ది రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను ఆదివారం విడుదల చేశారు. ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుడిగా తాను ఒక మాట చెప్పదలుచుకున్నానని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళవద్దని చిరంజీవి ప్రజలకు సూచించారు. వైరల్ ఫీవర్ వంటివి వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. వరద ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉందని, ఎన్నో గ్రామాలు, రోడ్లు నీటితో మునిగిపోయాయన్నారు.

Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి

రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొద్ది రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను ఆదివారం విడుదల చేశారు. ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుడిగా తాను ఒక మాట చెప్పదలుచుకున్నానని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళవద్దని చిరంజీవి ప్రజలకు సూచించారు. వైరల్ ఫీవర్ వంటివి వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. వరద ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉందని, ఎన్నో గ్రామాలు, రోడ్లు నీటితో మునిగిపోయాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిరంజీవి కోరారు. అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రావద్దని సూచించారు. ఇటువంటి విపత్తులు వేళ ప్రజలకు, బాధితులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నానని స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. వరదలు నేపథ్యంలో అనేక గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం చిరంజీవి సామాజిక మాధ్యమాల్లో చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సామాజిక బాధ్యతగా చిరంజీవి ప్రజలను అప్రమత్తం చేసేలా ఈ ప్రకటన చేశారంటూ ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం, సోమవారం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రజలు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

అప్రమత్తం చేసిన ప్రభుత్వాలు 

మరోవైపు రెండు రాష్ట్రాల ప్రజలను ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలను అలెర్ట్ చేసింది. వర్షాలకు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాయి ప్రభుత్వాలు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని ప్రజలను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్