కొత్త ఏడాదిలో పసిడి ధరలకు కళ్లెం పడేనా.. 90 వేల మార్క్ దాటే అవకాశం.!

గడిచిన కొన్నాళ్లుగా పసిడి ధరలు జెట్ స్పీడ్ తో పెరుగుతున్నాయి. 2024లో పసిడి ధర 23% పెరగగా, వెండి ధర 30 శాతం మేర పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో కూడా వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇది కొంత ఆందోళనకు గురి చేస్తుంది. ప్రపంచాన్ని అస్థిరతలు ఆవరించినప్పుడల్లా సురక్షితమైన రాబడులు అందించిన ఘనత బంగారానికి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

gold

పసిడి

గడిచిన కొన్నాళ్లుగా పసిడి ధరలు జెట్ స్పీడ్ తో పెరుగుతున్నాయి. 2024లో పసిడి ధర 23% పెరగగా, వెండి ధర 30 శాతం మేర పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో కూడా వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇది కొంత ఆందోళనకు గురి చేస్తుంది. ప్రపంచాన్ని అస్థిరతలు ఆవరించినప్పుడల్లా సురక్షితమైన రాబడులు అందించిన ఘనత బంగారానికి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2025 సంవత్సరంలో బంగారం 10 గ్రాముల రూ.90,000 తాకే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఉపశమించి, ద్రవ్య విధానంలో కాఠిన్యం తగ్గితే మాత్రం బంగారం ధర తగ్గిన ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ పరిస్థితి గనుక ఏర్పడితే మాత్రం రూ.85,000 వరకు వెళ్ళవచ్చని పేర్కొంటున్నారు. కిలో వెండి పరిస్థితిలను బట్టి రూ.1.25 లక్షలు చేరుకునే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు ఉంటే మాత్రం రూ.1.10 లక్షలకు పరిమితం కావచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.79,350 కాగా, ఎంసీ ఎక్స్ ఫ్యూచర్ ట్రేడ్లో 10 గ్రాములు రూ.76,600 పలుకుతోంది. దేశీయ మార్కెట్లో 23 శాతం లాభంతో బంగారం 2024వ సంవత్సరంలో మంచి రాబడి అందించింది. అక్టోబర్ 30వ తేదీన 10 గ్రాముల బంగారం జీవితకాల గరిష్ట స్థాయి రూ.82,400ని తాకింది. వెండి కూడా కిలో లక్ష దాటింది. 1979 తర్వాత బులియన్ మార్కెట్ నమోదు చేసిన అత్యుత్తమ ర్యాలీ ఇదే అని బులియన్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ విపణిలో చూసిన ఓన్స్ బంగారం రూ.2,062 డాలర్ల వద్ద ప్రారంభమై, అక్టోబర్ 31న రికార్డు గరిష్ట స్థాయి రూ.2,790 డాలర్లు తాకింది. అంతర్జాతీయంగా ఏడాదిలో బంగారం పెట్టుబడిపై 28% రాబడి అందించింది. ఆభరణాల డిమాండ్ బంగారం ధరలను ప్రభావితం చేసే మరో అంశం. ఒకపక్క పండగలు, వివాహాలు సీజన్, మరోపక్క గత జూలైలో బంగారంపై దిగుమతి శుంకాన్ని ప్రభుత్వం 0.9 శాతం మేర తగ్గించడం వంటి చర్యలతో దేశంలో బంగారం వినియోగం 17 శాతం పెరిగిందని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

2019-24 సంవత్సరాల మధ్య కాలంలో దేశీయ ఆభరణాల పరిశ్రమ 11 శాతం సమీకృత వార్షిక అభివృద్ధిని నమోదు చేసింది. పండగలు, వివాహాలు సీజన్ కారణంగా నవంబర్లో బంగారం దిగుమతులు నాలుగు రెట్లు పెరిగి రికార్డు గరిష్ట స్థాయి రూ.1486 కోట్ల డాలర్లకు చేరాయి. నూతన సంవత్సరంలో కూడా ఆభరణాల డిమాండ్ బలంగానే ఉంటుందని అఖిల భారత వజ్రాభరణాల వ్యాపారుల మండలి అంచనా వేస్తున్నారు. కొత్త ఏడాదిలో బంగారం ధరలకు వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధాన వైఖరి దిక్సూచి అంటున్నారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించినట్లయితే మార్కెట్లో లిక్విడిటీ పెరిగి అమెరికన్ డాలర్ బలహీనపడుతుందని, ఇది బంగారం ధరల అభివృద్ధికి దోహదపడే అంశం అనీ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కేంద్ర బ్యాంకులు అప్రమత్తత ధోరణిని ప్రదర్శించినట్లయితే మాత్రం బంగారం ధర పెరుగుదలకు దోహదకారి అవుతుందని వారు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో కేంద్ర బ్యాంకుల నిల్వలు పెంచుకునే లక్ష్యంతో బంగారం కొనుగోలు కొనసాగిస్తూ కరెన్సీ స్థిరత్వంపై ఆందోళనలు నెలకొంటే మాత్రం బంగారం ధరలు పెరుగుదలను ఆపే శక్తి ఏది ఉండదని వ్యాఖ్యానించారు. 2024లో భారతీయ రిజర్వు బ్యాంకు సహా వివిధ కేంద్ర బ్యాంకులు 500 టన్నులకు పైబడిన బంగారం కొనుగోలు చేశాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్