భవిష్యత్తు అవసరాల కోసం వివిధ పొదుపు మార్గాలను ఎంతోమంది అనుసరిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ రాబడిన ఇచ్చే కొన్ని పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తాన్ని భవిష్యత్తులో పొందేందుకు అవకాశం ఉంటుంది. అటువంటి ప్లాన్స్ పట్ల అవగాహన లేకపోవడంతో చాలామంది దూరంగా ఉంటున్నారు. ఎక్కువమందికి ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాల మీద అవగాహన ఉండదు. ముఖ్యంగా ఆడపిల్లల గురించి ఆలోచించే వారి సంఖ్య కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ.. వారి అవసరాల కోసం పొదుపు చేస్తే భవిష్యత్తులో ఎక్కువ రాబడిన ఇచ్చే ప్లాన్స్ పట్ల అవగాహన ఉండడం లేదు. దీంతో భవిష్యత్తులో మంచి ఆదాయాన్ని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రతీకాత్మక చిత్రం
భవిష్యత్తు అవసరాల కోసం వివిధ పొదుపు మార్గాలను ఎంతోమంది అనుసరిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ రాబడిన ఇచ్చే కొన్ని పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తాన్ని భవిష్యత్తులో పొందేందుకు అవకాశం ఉంటుంది. అటువంటి ప్లాన్స్ పట్ల అవగాహన లేకపోవడంతో చాలామంది దూరంగా ఉంటున్నారు. ఎక్కువమందికి ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాల మీద అవగాహన ఉండదు. ముఖ్యంగా ఆడపిల్లల గురించి ఆలోచించే వారి సంఖ్య కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ.. వారి అవసరాల కోసం పొదుపు చేస్తే భవిష్యత్తులో ఎక్కువ రాబడిన ఇచ్చే ప్లాన్స్ పట్ల అవగాహన ఉండడం లేదు. దీంతో భవిష్యత్తులో మంచి ఆదాయాన్ని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఆలోచించే వాళ్ళు ఎల్ఐసి కన్యాదాన్ పాలసీ ఎంచుకుంటే మంచి ఆదాయం భవిష్యత్తులో లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు అతి తక్కువ మొత్తాన్ని పొదుపు చేస్తే పెళ్లి చేసేనాటికి రూ.27 లక్షల రూపాయలు చేతికి వస్తాయి. ఇందులో రోజుకు రూ.121 రూపాయలు పొదుపు చేస్తే పెళ్లి చేసేనాటికి ఈ భారీ మొత్తం చేతికి అందుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను పరిశీలిస్తే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) ప్రవేశపెట్టిన ఎల్ఐసి కన్యాదాన్ పాలసీ తల్లిదండ్రులు తమ కుమార్తె భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో రోజుకు 121 రూపాయలు డిపాజిట్ చేస్తే నిర్దిష్ట సమయం తర్వాత రూ.27 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చేతికి అందుతాయి.
ఇది ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తున్నారు అన్నదానని బట్టి వచ్చే బోనస్ ఎంత అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కనీస రోజు వారి పెట్టుబడి రూ.121 అయితే.. మెచ్యూరిటీ మొత్తం రూ.27 లక్షలు. పాలసీ కాలపర్మతి 13 నుంచి 25 సంవత్సరాలు వరకు ఉంటుంది. ఉదాహరణకు ఒక అమ్మాయి వయసు ఐదు సంవత్సరాలు అనుకుంటే ఇప్పుడు రోజుకి రూ.121 రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. 25 ఏళ్ళు డిపాజిట్ చేస్తే వచ్చే ఎల్ఐసి ద్వారా బోనస్ లు, లాయల్టీ వంటి వాటితో కలిపి మొత్తం మెచ్యూరిటీ రూ.27 లక్షలు దాటుతుంది. ఈ పథకంలో లబ్ధిదారు తండ్రి వయసు కనీసం 30 సంవత్సరాలు, కుమార్తె వయసు కనీసం ఒక ఏడాది ఉండాలి. ఎల్ఐసి కన్యాదాన్ పాలసీ అనేది ఆదాయపన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80c కిందకు వస్తుంది. కాబట్టి వినియోగదారులు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. పాలసీదారు స్కీం మెచ్యూరిటీ కాలానికి ముందే కొన్ని అవాంఛనీయ కారణాలవల్ల మరణిస్తే కుటుంబ సభ్యులకు 10 లక్షల వరకు అందుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ప్రీమియం గడువు ముగిసిన తర్వాత మొత్తం 27 లక్షలు నామినీకి అందిస్తారు. ఎల్ఐసి కన్యాదాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి ఐడెంటిటీ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస రుజువు, కుమార్తె పుట్టినరోజు సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటివి కావాలి.