నిరుద్యోగ యువతకు శుభవార్త. లక్షకుపైగా వేతనాలతో పలు ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్ వెలువడింది. మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమో లేదా మైనింగ్ లేదా డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలను కల్పిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ నైవేలి లెగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో ఆ సంస్థ కోరింది. తమిళనాడు రాష్ట్రం నైవేలి లోని ప్రభుత్వ రంగ సంస్థ నైవేలి లెగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ తమ సంస్థలో ఖాళీగా ఉన్న 171 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. మే 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
symbolic image
నిరుద్యోగ యువతకు శుభవార్త. లక్షకుపైగా వేతనాలతో పలు ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్ వెలువడింది. మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమో లేదా మైనింగ్ లేదా డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలను కల్పిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ నైవేలి లెగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో ఆ సంస్థ కోరింది. తమిళనాడు రాష్ట్రం నైవేలి లోని ప్రభుత్వ రంగ సంస్థ నైవేలి లెగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ తమ సంస్థలో ఖాళీగా ఉన్న 171 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. మే 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. నైవేలి లెగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి ఈనాడు ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ ఓవర్ మాన్, మైనింగ్ సర్దార్ ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ ఓవర్ మాన్ పోస్టులు 69 ఉన్నట్టు పేర్కొంది. మైనింగ్ సర్దార్ పోస్టులు 102 భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మైనింగ్ లేదా మైనింగ్ ఇంజనీరింగ్ లో డిప్లమో లేదా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2025 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 ఏళ్ళు దాటరాదు. రూల్స్ ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపు లభిస్తుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయసు సడలింపు ఉంది. దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్ల వయసు సడలింపు వర్తిస్తుంది. ఉద్యోగాన్ని బట్టి వేతనం లభిస్తుంది. జూనియర్ ఓవర్ మ్యాన్ ఉద్యోగానికి ఎంపిక అయ్యే అభ్యర్థులకు నెలకు రూ.31,000 నుంచి లక్ష రూపాయల వరకు జీతం లభిస్తుంది. మైనింగ్ సర్దార్ పోస్టుకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు నేలకు రూ.26 వేల రూపాయల నుంచి రూ.1,10,000 వరకు జీతం లభిస్తుంది. ఆయా ఉద్యోగాలకు రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు ఫీజుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే జూనియర్ ఓవర్ మ్యాన్ కు యుఆర్/ ఈ డబ్ల్యూ ఎస్ / ఓబీసీ అభ్యర్థులకు రూ.595 గా ఫీజును నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.295 గా ఫీజును నిర్ణయించారు. మైనింగ్ సర్దార్ పోస్టుకు యుఆర్/ ఈ డబ్ల్యూ ఎస్ / ఓబీసీ అభ్యర్థులకు రూ.486 గా ఫీజు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.236 గా ఫీజును నిర్ణయించారు. నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాల కోసం అధికారిక వెబ్సైట్ http://www.nlcindia.in కు సంప్రదించాలని కోరింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ కోరింది.