రేషన్ కార్డులకు భారీగా దరఖాస్తులు.. రెండు లక్షలకుపైగా అప్లికేషన్స్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లోనే సుమారు రెండు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లోనే సుమారు రెండు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు నమోదు చేసి వాటి ప్రతులను సివిల్ సప్లై సర్కిల్ కార్యాలయాల్లో దరఖాస్తుదారులు సమర్పిస్తున్నారు. తాజాగా వచ్చిన రెండు లక్షలకుపైగా దరఖాస్తుల్లో హైదరాబాద్ పౌర సరఫరాల శాఖ పరిధిలోని తొమ్మిది సర్కిల్స్ లో 92,892, శివారులోని రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో మరో 1.1 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గడిచిన నాలుగేళ్లుగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరణ లేకపోవడంతో ప్రస్తుతం భారీగా దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. సమయం తక్కువగా ఉందన్న ఆందోళన పద్యంలో దరఖాస్తుదారులు మీసేవ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. 10 ఏళ్ల క్రిందట పౌరసరఫరాల శాఖ సంస్కరణలో భాగంగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ కోసం ఈపిడిఎస్ ఎఫ్ఎస్సి ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. నిరంతర ప్రక్రియ అంటూ ఆదిలో వచ్చిన దరఖాస్తులు వచ్చినట్టే క్షేత్రస్థాయి విచారణ జరిపి మంజూరు చేస్తూ వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల సంఖ్య పెరిగిపోతుండడంతో మంజూరు నిలిపివేస్తూ దరఖాస్తులు మాత్రం స్వీకరిస్తూ వచ్చింది. దరఖాస్తుల పెండెన్సీ పెరిగిపోవడంతో 2021లో కొత్త వాటి స్వీకరణ ప్రక్రియను నిలిపివేసింది. అప్పటివరకు వచ్చిన వాటిని 360 డిగ్రీల్లో పరిశీలించి అర్హత గల కుటుంబాలకు కార్డులు మంజూరు చేసింది. అప్పట్లో మొత్తం 60% దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఆన్లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే విసులబాటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పేద కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చి చేరాయి. అధికారికంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరణ లేకపోయినప్పటికీ పేద కుటుంబాలు ఆరు గ్యారెంటీల పథకాలతో పాటు ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రభుత్వం కూడా వీటిని ఆన్లైన్లోనే స్వీకరించింది. వీటిని మాత్రం ఆన్లైన్లో నమోదు చేయలేదు. అనంతరం ఇటీవల జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులో లేని కుటుంబాలను గుర్తించి విచారణ జరిపింది. వార్డు సభ్యులు ఏర్పాటు చేసి జాబితా ప్రకటిస్తామని చెప్పింది. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో తిరిగి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అర్హులైన లబ్ధిదారులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్