మగువలకు అత్యంత ప్రీతిపాత్రమైన బంగారం ధర రోజురోజుకు పైకి ఎగబాకుతోంది. హోలీ రోజు కూడా బంగారం ధర భారీగా పెరగడంతో మహిళలకు షాప్ తగిలింది. గడిచిన కొన్నాళ్లుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మరోసారి పెరిగాయి. దీంతో ఆల్టైమ్ రికార్డు ధరకు బంగారం చేరుకుంది. గడిచిన పది రోజుల్లో కొన్ని రోజులపాటు బంగారం ధర కొంత వరకు తగ్గుతూ వచ్చింది. అమెరికాలో నెలకొన్న పరిణామాలు, ఇతర కారణాలతో మరోసారి బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్ వల్ల దేశీయంగా మరోసారి బంగారం ధరలకు రెక్కలు వచ్చినట్టు నిపుణులు చెబుతున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
మగువలకు అత్యంత ప్రీతిపాత్రమైన బంగారం ధర రోజురోజుకు పైకి ఎగబాకుతోంది. హోలీ రోజు కూడా బంగారం ధర భారీగా పెరగడంతో మహిళలకు షాప్ తగిలింది. గడిచిన కొన్నాళ్లుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మరోసారి పెరిగాయి. దీంతో ఆల్టైమ్ రికార్డు ధరకు బంగారం చేరుకుంది. గడిచిన పది రోజుల్లో కొన్ని రోజులపాటు బంగారం ధర కొంత వరకు తగ్గుతూ వచ్చింది. అమెరికాలో నెలకొన్న పరిణామాలు, ఇతర కారణాలతో మరోసారి బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్ వల్ల దేశీయంగా మరోసారి బంగారం ధరలకు రెక్కలు వచ్చినట్టు నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం తులం బంగారం ధర ఏకంగా రూ.1200 పెరిగింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో గోల్డ్ కొనాలనుకునే వారికి ఇబ్బందిగా మారుతుంది. శుక్రవారం దేశంలోని అనేక ప్రాంతాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.8,978 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.8,230 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1100 పెరగడంతో రూ.82,300 కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1200 పెరగడంతో రూ.89,780 కి చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,450 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,930 ట్రేడ్ అవుతోంది.
మరో వైపు వెండి ధర కూడా రోజురోజుకూ పెరుగుతోంది. కిలో వెండి ధర సుమారు లక్షకు చేరుకుంది. గడిచిన ట్రేడింగ్ సెషన్లో 1,00,200గా ఉన్న వెండి ధర తాజాగా రూ.1,01,200కు చేరింది. ఇది ఐదు నెలల గరిష్టానికి సమానంగా చెబుతున్నారు. అంతర్జాతీయంగా చూస్తే బంగారం ఔన్సు ధర రూ.2,946 డాలర్లకు చేరుకుంది. అమెరికాలో తాజాగా వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు పసిడి ధర పెరగడానికి కారణమయ్యాయి. అంచనాలు కంటే తక్కువగా ద్రవ్యోల్బణం నమోదు కావడంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించేందుకు మార్గం సుగమం చేసింది. ఈ కారణంతోనే బంగారం వైపు పెట్టుబడిదారులు మళ్లుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల బంగారం ధరల్లో భారీగా పెరుగుదల కనిపిస్తున్నట్టు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత పతాక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. శుక్రవారం ఉదయం నాటికి వెండి ధర భారీగా పెరిగాయి. కిలో వెండిపై ఏకంగా రూ.2000 పెరిగింది. పెరుగుతున్న ధరలతో వెండి కూడా బంగారంగా మారుతుంది. హైదరాబాదులో కిలో వెండి ధర. రూ.1,12,000 వద్ద అమ్ముడు అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,03,000 కు చేరింది.