పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు.. చంద్రబాబు వద్దన్నా ఆగడం లేదంటూ పేర్ని ఆవేదన

సామాజిక మాధ్యమాలు వేదికగా తనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారంటూ మాజీమంత్రి పేర్ని నాని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 10వ తేదీ నుంచి తన భార్య జయసుధ పేరు మీద మచిలీపట్నంలో ఉన్న గోడౌన్ ఆఫర్ లెటర్ ఇచ్చి అధిక తీసుకున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. అక్రమార్కుడిగా తానేదో ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశానని అత్యుత్సాహంతో ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

Nani is talking to the media

మీడియాతో మాట్లాడుతున్న పేర్ని నాని

సామాజిక మాధ్యమాలు వేదికగా తనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారంటూ మాజీమంత్రి పేర్ని నాని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 10వ తేదీ నుంచి తన భార్య జయసుధ పేరు మీద మచిలీపట్నంలో ఉన్న గోడౌన్ ఆఫర్ లెటర్ ఇచ్చి అధిక తీసుకున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. అక్రమార్కుడిగా తానేదో ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశానని అత్యుత్సాహంతో ఆరోపణలు చేశారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, తమ అత్తమామలు నిర్మాణం చేసి గోడౌన్ తమకు ఇచ్చారన్నారు. పనులు చేసుకో లేకపోతే హద్దులు వస్తాయని నిర్మాణం చేశామన్నారు. తాను, తన భార్య కానీ ఏ రోజు వెళ్లి చూసేదేమి ఉండదని, తమ దగ్గర ఉన్న మేనేజర్ అక్కడ స్టాక్ లో తేడాలు ఉన్నాయని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా పేర్ని నాని గుర్తు చేశారు. స్టాక్ లో లోపం ఉందని తెలిసిన తరువాత నవంబర్ 26న జాయింట్ కలెక్టర్ కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామని, తమవల్ల తప్పు లేకపోయినా స్టాక్ తగ్గిందని నైతిక బాధ్యత వహించి లేఖ ఇచ్చామన్నారు. 

అధికారులు ఫిజికల్ గా స్టాక్ వెరిఫై చేసి సివిల్ సప్లయిస్ ఎండికి లెటర్ రాశారని, ఈ నెల 10వ తేదీన వారు క్రింది స్థాయి అధికారులకు డబ్బులు కట్టించుకుని క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశించారని పేర్ని నాని పేర్కొన్నారు. డిసెంబర్ 10వ తేదీన కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ తన భార్య జేసుదాసులతోపాటు ఇతర అధికారులకు నోటీసులు ఇచ్చిన విషయాన్ని పేర్ని వెల్లడించారు. 3708 బస్తాల స్టాక్ వేరియేషన్ కనిపిస్తోందని, 1.70 లక్షలు మూడు రోజుల్లో గా కట్టాలని గోడౌన్ దగ్గర అంటించి వెళ్ళారని వివరించారు. అప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు అయినందున తమ లీగల్ టీం ఉద్దేశపూర్వకంగానే అధికారులు ఇలా చేసి ఉంటారని గుర్తించారన్నారు. తమ కుటుంబ సభ్యులంతా ఆ డబ్బులను జమ చేశామని, కేవలం నైతిక బాధ్యత వహించి డబ్బులు జమ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తాము ఏ తప్పు చేయలేదని ఒక లెటర్ కూడా ఇచ్చామన్నారు. 11వ తేదీన జిల్లా కోర్టులో తన భార్య జయసుధ బెయిల్ కోసం దరఖాస్తు చేసిందని, బెయిల్ రాకుండా ఉండేందుకు కూడా పలు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఏదో ఒకరకంగా తనను, తన భార్యను అరెస్టు చేయాలని రాజకీయ కక్షతో చేస్తున్నారని, తాను ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో ఇంట్లో ఆడవాళ్ళ మీద కేసులు పెడితే వారిని రక్షించాలని చూస్తారా.? లేక వారిని జైలుకు పంపిస్తారా అని ఈ సందర్భంగా పేరుని ప్రశ్నించారు. తాను తప్పు చేశానని ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవచ్చన్నారు. కేవలం అద్దెకు ఆశపడి గోడౌన్ కట్టడమే తప్ప తాము చేసిన తప్పేంటని పేర్ని ప్రశ్నించారు. 

రాజకీయాల్లో తాము ఎప్పుడూ తప్పుడు పనులకు పాల్పడలేదని, నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఎవరైనా ఇలా చేస్తారా అని పేర్ని పేర్కొన్నారు. తానేమైనా తప్పుడు పనులు చేసే వ్యక్తినా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఒక రాష్ట్రానికి మంత్రిగా చేసిన వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా పనిచేస్తానా.? అని ప్రశ్నించారు. బిజెపిగా పనిచేస్తున్న వ్యక్తి గతంలో ఆర్టీసీ ఎండీగా చేశారని, తాను రవాణా శాఖ మంత్రిగా పనిచేశామని పేర్కొన్నారు. నేను ఎప్పుడైనా ఏవైనా తప్పుడు పనులు చేయించాను లేదా అన్న విషయాన్ని ఆయన చెప్పాలన్నారు. తన గురించి చెడుగా మాట్లాడుతున్న ఒక మంత్రి తన భార్య మీద కేసు పెట్టడం దగ్గర నుంచి అరెస్టు చేయాలని అన్ని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు చెబితే ఆయన ఒప్పుకోలేదని, ఇంట్లో ఆడవాళ్ళ మీద కేసులు ఏంటి అని చెప్పి చంద్రబాబు వెళ్ళిపోయారని విషయాన్ని ఈ సందర్భంగా పేర్ని నాని వెల్లడించారు. కావాలంటే నాని, వాళ్ళ అబ్బాయిని అరెస్టు చేయాలని చంద్రబాబు చెప్పారన్నారు. రాజకీయ వైరం ఉంటే తన మీద చూసుకోవాలని, ఇంట్లో ఉండే తన భార్య ఏం చేసిందని మండిపడ్డారు. తనను, తన కొడుకును అరెస్టు చేయడమే కదా మిగిలిందని, అరెస్టు చేసుకోండని స్పష్టం చేశారు. చంద్రబాబు తిట్టిన తర్వాత కూడా బెయిల్ రాకుండా అనేక ప్రయత్నాలు చేశారని, గోడౌన్ దగ్గర నానా హంగామా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగినవన్నీ లాయర్లు వీడియోలు తీశారని, ప్రతి విషయంలో బయటకు వచ్చి మాట్లాడే నాని ఎందుకు మాట్లాడలేదని కొందరు ప్రశ్నిస్తున్నారన్నారు. తాను కొద్దిరోజులు ముందే మాట్లాడాలని చూసినా కోర్టులో కేసు నడుస్తున్నందువల్ల మా లాయర్లు చెప్పడంతో ఆగిపోయినట్లు పేర్ని నాని చెప్పుకొచ్చారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్