ఏపీలో మరిన్ని రేషన్‌ దుకాణాలు.. కొత్తవి ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు

రాష్ట్రంలో కొత్త రేషన్‌ దుకాణాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న వాటిని కొనసాగించడంతోపాటు మరిన్ని కొత్త దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం రేషన్‌ దుకాణాలకు వెళ్లి వినియోగదారులు రేషన్‌ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసింది. ఈ వాహనాలు ద్వారా ప్రభుత్వం ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీ ప్రక్రియను చేపట్టింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేషన్‌ డిపోలకు సంబంధించి కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.

Ration shop

రేషన్‌ షాపు

రాష్ట్రంలో కొత్త రేషన్‌ దుకాణాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న వాటిని కొనసాగించడంతోపాటు మరిన్ని కొ త్త దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం రేషన్‌ దుకాణాలకు వెళ్లి వినియోగదారులు రేషన్‌ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసింది. ఈ వాహనాలు ద్వారా ప్రభుత్వం ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీ ప్రక్రియను చేపట్టింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేషన్‌ డిపోలకు సంబంధించి కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. కొత్త దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే కొత్త దుకాణాలు ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను తయారు చేసే పనిని అధికారులకు అప్పగించినట్టు తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,774 రేషన్‌ షాపులు ఉన్నాయి. వీటిని మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. జనావాసాల్లో రేషన్‌ దుకణాలు ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారులకు మేలు చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్‌ షాపులకు 400 నుంచి 450 కార్లుకు, పట్టణాల్లో 500 నుంచి 550 షాపులకు, నగరాల్లో అయితే 600 నుంచి 650 షాపులకు ఒక రేషన్‌ షాపు ఉండేలా నూతన నిబందనలను ప్రభుత్వం తీసుకువస్తున్నట్టు చెబుతున్నారు. కొత్త కార్డులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధమవుతోంది. కొత్త కార్డులు మంజూరు ప్రక్రియ పూర్తయిన తరువాత కొత్త రేషన్‌ షాపులను ఏర్పాటు చేయనున్నట్టు చెబుతున్నారు. వచ్చే నెల 22వ తేదీలోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నూనత రేషన్‌ కార్డులు మంజూరుకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు కొద్ది రోజుల్లో అవకాశాన్ని కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కొత్త కార్డులు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వాహనాలను ఏం చేస్తుందన్న దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. లక్షలాది రూపాయలు వెచ్చించి వాహనాలను ఏర్పాటు చేయడంతోపాటు అందులో పని చేసే సిబ్బందికి కూడా భారీగా వేతనాలను గత ప్రభుత్వం చెల్లించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా ఈ వాహనాలు కొనసాగుతున్నాయి. వీటిపైనా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఉంది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్