ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల్లో పని చేస్తున్న టేక్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నెలకొన్న ఆర్థిక అస్థిరత ఉద్యోగుల తొలగింపుకు కారణం అవుతోంది. ఇప్పటికే వేలాదిమంది ఉద్యోగాల నుంచి తొలగింపబడ్డారు. ప్రధానంగా ఐటీ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించడానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ఆర్థిక అస్థిరత కారణంగా గ్లోబల్ మార్కెట్లలో పెరిగిన ఒత్తిడి, సుంకాల యుద్ధం, అమెరికాలో ఆర్థిక మాంద్య భయం, వరుస నష్టాలు, ఏఐ వినియోగం పెరిగిపోతుండడంతో అనేక కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను అనేక సంస్థలు తొలగిస్తున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల్లో పని చేస్తున్న టేక్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నెలకొన్న ఆర్థిక అస్థిరత ఉద్యోగుల తొలగింపుకు కారణం అవుతోంది. ఇప్పటికే వేలాదిమంది ఉద్యోగాల నుంచి తొలగింపబడ్డారు. ప్రధానంగా ఐటీ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించడానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ఆర్థిక అస్థిరత కారణంగా గ్లోబల్ మార్కెట్లలో పెరిగిన ఒత్తిడి, సుంకాల యుద్ధం, అమెరికాలో ఆర్థిక మాంద్య భయం, వరుస నష్టాలు, ఏఐ వినియోగం పెరిగిపోతుండడంతో అనేక కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను అనేక సంస్థలు తొలగిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వందకు పైగా కంపెనీలు దాదాపు 27 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. ఇదే బాటలో మరికొన్న ప్రముఖ దిగ్గజ కంపెనీలు కూడా పయనించేందుకు సిద్ధమవుతున్నాయి. ఏ క్రమంలోనే గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ కూడా లే ఆప్స్ ప్రకటించింది.
ఈ క్రమంలోనే ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్వెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ టీమ్స్ లో పనిచేస్తున్న వందలాదిమంది ఉద్యోగులకు గూగుల్ కంపెనీ లే ఆఫ్ లు ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఈ సంస్థ ఉంచింది. అయితే ఇదే సంస్థలో పనిచేసే ఒక వ్యక్తి ద్వారా లే ఆప్స్ విషయం బయటకు వచ్చినట్లు జాతీయ మీడియా చెబుతోంది. అయితే ఈ లే ఆప్స్ ప్రభావం ఎంతమంది ఉద్యోగులపై పడుతుంది అన్నదానిపై స్పష్టత రాలేదు. కానీ దీని ప్రభావం వందలాది మందిపై ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గూగుల్ 2024 డిసెంబర్లో 10% మంది ఉద్యోగులకు లే ఆప్స్ ప్రకటించింది. అంతకుముందు ఏడాది జనవరిలో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. 2025లో సాంకేతిక రంగంలో సుమారు 100 కంపెనీలు 27 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. అంతకు ముందు సంవత్సరం టెక్ రంగంలో 549 కంపెనీలు 1,54,472 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. ఈ క్రమంలోనే గూగుల్ కూడా పలువురు ఉద్యోగులకు లే ఆఫ్లు ప్రకటించడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. దీని ప్రభావం ఎవరిపై ఉంటుందో తెలియక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న అనేక పరిస్థితులు సాంకేతిక రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పాలిట శాపంగా మారుతున్నాయి.