తెలంగాణ యువతకు శుభవార్త.. సరికొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్తను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అందించింది. నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చేలా కీలక పథకాన్ని ప్రారంభించింది. రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి తాజాగా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు రుణాలను ప్రభుత్వం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఈ పథకంలో భాగంగా రుణాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు ఆరు వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చించనుంది. ఒక్కో నిరుద్యోగ యువతకు 60 నుంచి 80 శాతం మేర సబ్సిడీతో ఈ రుణాలను ప్రభుత్వం అందిస్తుంది.

CM Revant Reddy launching the scheme

పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్తను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అందించింది. నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చేలా కీలక పథకాన్ని ప్రారంభించింది. రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి తాజాగా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు రుణాలను ప్రభుత్వం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఈ పథకంలో భాగంగా రుణాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు ఆరు వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చించనుంది. ఒక్కో నిరుద్యోగ యువతకు 60 నుంచి 80 శాతం మేర సబ్సిడీతో ఈ రుణాలను ప్రభుత్వం అందిస్తుంది. అర్హుడైన ఒక్కో యువకుడికి నాలుగు లక్షల వరకు రుణాలను అందించనున్నారు. ఈ రుణాలు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఏప్రిల్‌ ఐదో తేదీ వరకు గడువు విధించింది. ఈలోగా అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ ఆరో తేదీ నుంచి మే 31 వరకు అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. జూన్‌ రెండో తేదీన ప్రభుత్వం యువకులకు రుణాలను అందిస్తుంది. 

ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా జరగాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకంలో భాగంగా రుణాలు తీసుకునే యువత స్వయం ఉపాధి పొందే మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ రుణాలతో డైరీ, కోళ్ల పెంపకం, దుకాణాలు ఏర్పాటు వంటివి చేయడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వం ముఖ్య ఉద్ధేశం. అందుకు అనుగుణంగా యువత ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు కోరుతున్నారు. కొద్దిరోజుల్లోనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు కోరుతున్నారు. మరోవైపు ఈ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకునేందుకు యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్