|| ప్రతిమ హాస్పిటల్ ||
కరీంనగర్ జిల్లా నగునూర్లోని ప్రతిమ హాస్పిటల్ లో ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. జనవరి 23 నుండి జనవరి 28 వరకు ఉచిత శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు పెద్దపల్లి ప్రతిమ ఫౌండేషన్ మండల కో-ఆర్డినేటర్ శివ తెలిపారు. హేర్నియ(ఉబ్బు, గిలక, పేరుకుపోయిన కొవ్వు), హైడ్రోసీల్ (శారీరక గాయం, ఇన్ఫెక్షన్,కణితి, వెరికోసెల్ గడ్డలు), వెరికోస్ వేయిన్స్(సిరలు ఉబ్బిపోవడం), రొమ్ము గడ్డలు సంబందించిన వ్యాధులతో బాధపడే వారికి ఆపరేషన్ లు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. ఆపరేషన్ ఉచితంగా చేస్తారు కానీ దానికి మందులు ఆపరేషన్ చేయించుకునే రోగి భరించుకోవాలి.