కొద్దిరోజుల కిందట అనారోగ్యం బారినపడి హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి కొడాలి నాని కోలుకున్నారు. వారం రోజుల కిందట తీవ్ర అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందారు. గ్యాస్ట్రిక్ సంస్కారణంగా కొడాలి నాని మొదట ఆసుపత్రిలో చేరారు. పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యుల నిర్ధారించి వైద్య సేవలను అందించారు. మూడు వాల్స్ క్లోజ్ అయ్యాయని నిర్ధారించిన వైద్యులు స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. అయితే స్టంట్ వేయించుకునేందుకు కొంత సమయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో రెండో ఒపీనియన్ తీసుకోవాలని కుటుంబ సభ్యులు యోచిస్తున్నట్లు సమాచారం.
మాజీ మంత్రి కొడాలి నాని
కొద్దిరోజుల కిందట అనారోగ్యం బారినపడి హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి కొడాలి నాని కోలుకున్నారు. వారం రోజుల కిందట తీవ్ర అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందారు. గ్యాస్ట్రిక్ సంస్కారణంగా కొడాలి నాని మొదట ఆసుపత్రిలో చేరారు. పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యుల నిర్ధారించి వైద్య సేవలను అందించారు. మూడు వాల్స్ క్లోజ్ అయ్యాయని నిర్ధారించిన వైద్యులు స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. అయితే స్టంట్ వేయించుకునేందుకు కొంత సమయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో రెండో ఒపీనియన్ తీసుకోవాలని కుటుంబ సభ్యులు యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో ఏఐజి ఆసుపత్రి వైద్యులు ఆయనను సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత సర్జరీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వారం రోజులపాటు ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం కాస్త ఆరోగ్యం కుదురుతూ పడటంతో వైద్యులు అనుమతితో డిశ్చార్జ్ చేశారు. రెండు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన గుండెకు సంబంధించి వైద్య సేవలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాదులోని ఆయన నివాసానికి కొడాలి నాని వెళ్లారు. రెండు మూడు రోజులు గుడివాడకు వెళ్తారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ శ్రేణులు కొడాలి నాని కోలుకున్నారన్న వార్త తెలిసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన అనారోగ్యం పాడిన పడిన తర్వాత ఎంతోమంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆయన కోరుకొని డిశ్చార్జ్ కావడంతో వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కొద్దిరోజుల కిందట ఆసుపత్రిలో చేరిన కొడాలి నానిని ఉద్దేశించి ఆదివారం నిర్వహించిన ఒక సభలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరికి రెడ్ బుక్ పేరు వింటేనే కాలుజారుతుందని, గుండె బెదురుతోందంటూ వ్యాఖ్యానించారు. అర్థమైందా రాజా అంటూ మాజీ మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే కొడాలి నాని డిశ్చార్జ్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే మంత్రి లోకేష్ వ్యాఖ్యలు పట్ల సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బాబు లోకేష్ ముందుంది ముసళ్ళ పండగ అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. నీ రెడ్ బుక్కులో ఎంతోమంది పేర్లు ఉన్నాయని, మా వాళ్లు రాసుకునే అన్ని రెడ్ బుక్కుల్లోనూ నీ పేరే ఉందంటూ వ్యాఖ్యానించారు.