వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం పరామర్శించారు. అనకాపల్లిలోని వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఆయన అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్యులకు సూచించారు పార్టీ తరఫున అండగా ఉంటామని ప్రకటించారు.
బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న జగన్
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం పరామర్శించారు. అనకాపల్లిలోని వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఆయన అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్యులకు సూచించారు పార్టీ తరఫున అండగా ఉంటామని ప్రకటించారు. చికిత్స పొందుతున్న బాధితులు అందరి వద్దకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి పేరుపేరునా పలకరించి అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అచ్యుతాపురం ఘటన చాలా బాధాకరమని, ప్రమాదం జరిగింది పట్టపగలైన ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రమాదానికి సంబంధించి బాధితుల వివరాలు కార్మిక శాఖ మంత్రి దగ్గర కూడా లేవన్నారని, ఎంత మంది చనిపోయారో తెలియదని మంత్రి చెప్పడం కంటే నిర్లక్ష్యం మరొకటి ఉండదన్నారు. ఘటనా స్థలానికి అంబులెన్సులు కూడా రాని పరిస్థితి నెలకొందని, బాధితులను కంపెనీ బస్సుల్లో తీసుకువచ్చారని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వ హాయంలో ఎల్జి పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించామని, 24 గంటల్లోపే పరిహారం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరగాలన్న జగన్మోహన్ రెడ్డి.. బాధితులకు సకాలంలో నష్ట పరిహారం ఇవ్వకుంటే తానే వచ్చి స్వయంగా ధర్నా చేస్తానని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని స్పష్టం చేశారు. పరిశ్రమలపై పర్యవేక్షణ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. పరిశ్రమలో సెక్యూరిటీ ప్రోటోకాల్ అమలు చేయాలని, దీని కోసం తమ ప్రభుత్వం అనేక జీవోలు తెచ్చి అమలు చేసామన్నారు. ఈ ప్రభుత్వం రెడ్ బుక్ లో పేర్లు రాయడం, కక్షపూరితంగా వ్యవహరించడం తప్పా అభివృద్ధి లేదన్నారు. జనవరి నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వ్యవసాయానికి పెట్టుబడి కింద ప్రభుత్వం రూ.2000 సాయం అందించలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు జరగడంలేదని విమర్శించారు. నాడు - నేడు పథకంలో స్కూల్స్ బాగుపడ్డాయని, ఇప్పుడు అమ్మఒడి పథకం, ఫీజు రియంబర్స్మెంట్ సొమ్ము అందక విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రమాద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని స్పష్టం చేశారు. పరిశ్రమంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి లోతైన దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. పరిహారం అనేది సానుభూతితో ఇవ్వాలని, ఇవ్వాల్సిన సమయంలోనే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రూపాయి కూడా బాధితులకు ముట్టలేదని, ఇవ్వాల్సిన పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో ప్రమాదం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడిన విషయాలను చూసి తాను ఆశ్చర్యపోయినట్లు జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇష్యూను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. ప్రభుత్వం అనేది బాధ్యత వ్యవహరించాలని, పరిశ్రమల పర్యవేక్షణ ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. కంపెనీలు సమర్పించే నివేదికలపై థర్డ్ పార్టీ కంపెనీలు ఆడిట్ సేవలను తాము అందుబాటులోకి తీసుకువచ్చామని, కానీ గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం మానేశారని పేర్కొన్నారు.