తుది దశకు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. ఉగాది నాటికి మూడో కోట పూర్తి.!

నామినేటెడ్ పదవుల భర్తీ కసరత్తు కొలిక్కి వస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో నామినేటెడ్ పోస్టులను ఏపీలోని కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. మిగిలిన పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఉగాది నాటికి మొత్తం పోస్టులను భర్తీ చేసేలా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలను జారీ చేశారు. మూడో విడతలో మార్కెట్ కమిటీల భర్తీకే పరిమితం కావాలని భావిస్తూ ఉండడంతో కీలకమైన కార్పొరేషన్లను ఆశిస్తున్న ఆశావాహులకు నిరాశ తప్పదు. మహానాడు సమయానికి నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది సెప్టెంబర్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

నామినేటెడ్ పదవుల భర్తీ కసరత్తు కొలిక్కి వస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో నామినేటెడ్ పోస్టులను ఏపీలోని కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. మిగిలిన పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఉగాది నాటికి మొత్తం పోస్టులను భర్తీ చేసేలా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలను జారీ చేశారు. మూడో విడతలో మార్కెట్ కమిటీల భర్తీకే పరిమితం కావాలని భావిస్తూ ఉండడంతో కీలకమైన కార్పొరేషన్లను ఆశిస్తున్న ఆశావాహులకు నిరాశ తప్పదు. మహానాడు సమయానికి నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది సెప్టెంబర్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. 20 కార్పొరేషన్ల చైర్మన్ ల తోపాటు 99 మందితో తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు. రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ నవంబర్లో జరిగింది. తొలి, రెండో విడతల్లో సుమారు 150 మంది నేతలకు న్యాయం చేశారు. మూడో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై నాలుగు నెలలుగా కసరత్తు జరుగుతున్న సామాజిక సమీకరణాలు.. కూటమి పార్టీ ఇలా డిమాండ్లను నేపథ్యంలో ఒక కొలిక్కి రావడం లేదు. దీంతో ఎట్టకేలకు ఏఎంసి చైర్మన్ పోస్టుల భర్తీకి సంబంధించి మూడో విడత జాబితాకు తుది రూపు ఇస్తున్నారు. రాష్ట్రంలో 20018 మార్కెట్ కమిటీలు ఉండగా ఈ విడతలో 50 నుంచి 60 స్థానాలే భర్తీ చేయనున్నారు. మిగిలిన వాటిని మే నెలలో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఎంతోమంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. వీటిలో కీలకమైన కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. గడిచిన ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కోల్పోయిన నేతలు, పార్టీ కోసం గత ఐదేళ్లు కేసులను ఎదుర్కొనే కష్టపడిన నాయకులు వీటిపై ఆశలు పెట్టుకున్నారు. ఏఎంసీలతో పాటు ప్రణాళికా సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, నెడ్ క్యాప్, ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, డ్రైనేజీ బోర్డు, ఆప్కాబ్, మినరల్ డెవలప్మెంట్, దేవరజస్ట్ అయితరు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవులను మూడో విడతలో భర్తీ చేస్తారని అంతా భావించారు. అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ సహ మొత్తం 60 ముఖ్యమైన కార్పొరేషన్లతోపాటు ప్రధానమైన 21 ఆలయాలు చైర్మన్లు, కమిటీలను కూడా నియమించాల్సి ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి వీటన్నింటినీ భర్తీ చేస్తారని ఆశావహులు భావించిన కార్యరూపం దాల్చలేదు. ఊరించి ఊరించి ఉగాదికి భర్తీ చేస్తామని సాక్షాత్తు చంద్రబాబు ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగిన సమావేశంలో మార్చి నెలాఖరుకు భర్తీ చేస్తామని, మేలో జరిగే మహానాడు నాటికి పార్టీ కమిటీలు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఒక్క టీడీపీ నుంచి 60 వేల పైచిలుకు దరఖాస్తులు అందాయి. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారైనా కుటుంబ సాధికార సారధి బాధ్యత చేపట్టాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో ఆశావాహులు చాలామంది ఎప్పటికీ ఆ బాధ్యతలు చేపట్టారు. నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, గన్ని వీరాంజనేయులు, పరసారత్నం, తారపనేని నరేంద్ర, కనపర్తి శ్రీనివాసరావు, నాదెండ్ల బ్రహ్మం, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు. ప్రభాకర్ చౌదరి, గన్ని వీరాంజనేయులు వంటి నేతలు సీట్ల సర్దుబాటులో టికెట్లు కోల్పోయారు. వీరంతా ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్