ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపటి నుండి ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఇది నాగపట్నానికి 320 కిలోమీటర్లు ఆగ్నేయంగా, చెన్నైకి 500 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది గురువారం ఉదయానికి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. తరువాత రెండు రోజుల్లో శ్రీలంక తీరాన్ని తప్పించుకొని ఉత్తర తమిళనాడు తీరం దిశగా రానుందని ఐఎండి తెలిపింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఇది నాగపట్నానికి 320 కిలోమీటర్లు ఆగ్నేయంగా, చెన్నైకి 500 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది గురువారం ఉదయానికి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. తరువాత రెండు రోజుల్లో శ్రీలంక తీరాన్ని తప్పించుకొని ఉత్తర తమిళనాడు తీరం దిశగా రానుందని ఐఎండి తెలిపింది. శుక్రవారం రాత్రి ఉత్తర తమిళనాడులోని చెన్నై - కడలూరు మధ్య తుఫాను తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. శ్రీలంక తీరానికి సమీపంగా వచ్చేటప్పుడు చలిగాలులు తీవ్రవాయుగుండం వైపు వీచే అవకాశం ఉన్నందున దాని గమనం కొంత నెమ్మదిస్తుందని చెబుతున్నారు. గురువారం ఉదయం తుఫానుగా మారిన తర్వాత కొంతమేర బలపడుతుందని, శుక్రవారం ఉదయం నుంచి తిరిగి వాయుగుండం లేదా తీవ్రవాయుగుండం గా బలహీన పడుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శుక్రవారం రాత్రి ఉత్తర తమిళనాడులో తీరం దాటుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమలోని పాలుచోట్ల వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారింది. తీరం వెంబడి గాలుల తీవ్రత పెరిగింది. గురువారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో పోలీసు అట్లా వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. శుక్రవారం నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు రాష్ట్రంలోని అనేక చోట్ల వర్షాలు కురవనున్నాయి.

గురువారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. శనివారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, బాపట్ల, శ్రీ సత్య సాయి జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే నెల ఒకటి, రెండు, మూడు తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఈనెల 30వ తేదీ వరకు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి 65, అప్పుడప్పుడు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపలు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. కోస్తాంధ్రలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక ఎగురువేశారు. ఈ సీజన్లో వాయుగుండాలు / తుఫాన్లు దక్షిణ తమిళనాడు వైపు వస్తుంటాయని, దానికి భిన్నంగా ఇది ఉత్తర తమిళనాడు దిశగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కోస్తాంధ్రలో తీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని, తీరం నుంచి 30 కిలోమీటర్ల దాటిన తర్వాత ప్రభావం ఒక మోస్తారుగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి వివరించారు. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. పంట చేతికి వచ్చిన నేపథ్యంలో ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్