వరుస అల్పపీడనాలతో రైతాంగం ఉక్కిరిబిక్కిరి.. ఈనెల 26 న మరో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఒకదాని వెనుక మరొకటి వెంట వెంటనే వస్తున్నాయి. ఈ నెలలో ఎప్పటికీ రెండు అల్పపీడనాలు/వాయుగుండాలి వచ్చాయి. మూడోది ఐదు రోజుల నుంచి బంగాళాఖాతంలో అటు తిరిగి ఇటు తిరిగి చెన్నై, శ్రీహరికోటలకు సమాంతరంగా సముద్రంలో కొనసాగుతోంది. దీని వెనుక మూడు, నాలుగు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఒకదాని వెనుక మరొకటి వెంట వెంటనే వస్తున్నాయి. ఈ నెలలో ఎప్పటికీ రెండు అల్పపీడనాలు/వాయుగుండాలి వచ్చాయి. మూడోది ఐదు రోజుల నుంచి బంగాళాఖాతంలో అటు తిరిగి ఇటు తిరిగి చెన్నై, శ్రీహరికోటలకు సమాంతరంగా సముద్రంలో కొనసాగుతోంది. దీని వెనుక మూడు, నాలుగు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి సోమవారం మధ్యాహ్నంకి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా పయనించి మంగళవారానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరగా రానుందని వాతావరణ శాఖ తెరిపింది. దీని ప్రభావంతో సోమవారం కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు, తిరుపతి నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ నెల 25న ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, 26న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తా తీరంలో గంటకు 35 నుంచి 45 అప్పుడప్పుడు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపలు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని పోర్టుల్లో మూడో నెంబర్ భద్రత సూచిక ఎగరవేశారు. కాగా, కొన్ని వాతావరణ మోడల్స్ మేరకు మంగళవారం నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కృష్ణ, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

మరోవైపు ఈ నెల 26వ తేదీ తరువాత ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకొని భూమధ్యరేఖ పరిసరాల్లో హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది వాయువ్యంగా పయనించి శ్రీలంక దిశగా వస్తుందని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం రానున్న రెండు మూడు రోజుల్లో కొనసాగి తరువాత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 26వ తేదీన తరువాత ఏర్పడనున్న అల్పపీడనం శ్రీలంక తీరం దిశగా పయనించినప్పుడు దాంతో కలిసి బలపడి దక్షిణ తమిళనాడు వైపు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావంతో రానున్న ఐదారు రోజులు వరకు కోస్తా, రాయలసీమలో వర్షాలు కొనసాగుతాయని వివరించారు. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నందున బంగాళాఖాతంలో వరస అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. మంగళవారం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్