ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తీవ్ర పోటీ.. నాగబాబుకు బెర్త్ కన్ఫామ్.!

ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలకు కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు ఎమ్మెల్సీ స్థానాల కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఐదు స్థానాల్లో ఒక స్థానానికి ఇప్పటికే అభ్యర్థి ఖరారైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈ స్థానాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేటాయించినట్లు చెబుతున్నారు. గతంలోనే ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించి మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయింది.

Nagababu, SVSN Verma

నాగబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ 

ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలకు కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు ఎమ్మెల్సీ స్థానాల కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఐదు స్థానాల్లో ఒక స్థానానికి ఇప్పటికే అభ్యర్థి ఖరారైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈ స్థానాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేటాయించినట్లు చెబుతున్నారు. గతంలోనే ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించి మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయింది. తాజాగా ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించేందుకు టిడిపి అంగీకరించింది. ఈ ఒక్క స్థానాన్ని నాగబాబుకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప జనసేనకు కేటాయించే సీటులో అభ్యర్థి మారే అవకాశం లేదు. ఇక మిగిలిన నాలుగు స్థానాల కోసం టిడిపిలో తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. మరో స్థానాన్ని బిజెపి కోరుతున్నప్పటికీ టిడిపి ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. నాలుగు స్థానాలు కోసం పోటీ పడుతున్న వారిలో సీనియర్ నేతలు ఉన్నారు.

వీరిలో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఈయన పదవి కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మార్చి 20న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. అలాగే పిఠాపురం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన గడిచిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కోసం సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఆయనకు కొద్ది రోజుల కిందట నామినేటెడ్ పదవి ఇచ్చినప్పటికీ ఆయన దానితో సంతృప్తిగా లేరు. గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన కోరుతున్నారు. ఇప్పటికే తనదైన స్థాయిలో ఆయన ప్రయత్నాలను సాగిస్తున్నారు. అలాగే, గడిచిన ఎన్నికల్లో సీట్లను త్యాగం చేసిన మరికొందరు నేతలు కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఈ జాబితాలో మరో 10 మంది వరకు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానాలకు మాత్రం ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం పని చేసిన యువ నాయకులకు అప్పగించేందుకు నారా లోకేష్ సన్నద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కొన్ని పేర్లను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ జాబితాలో ఎన్నారై ఒకరు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే గడిచిన ఎన్నికల్లో వైసీపీ నుంచి టిడిపిలో చేరిన ఒకరికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. అలాగే రాజ్యసభ సీటు ఆశించి బంగపడిన మరో నేతకు ఈ స్థానాన్ని కేటాయిస్తారని చెబుతున్నారు. మరి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎవరికి అవకాశం లభిస్తుందో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్