ఎస్బిఐ నుంచి మహిళలకు అద్భుతమైన అవకాశం.. ఉచిత భోజనం, వసతితో శిక్షణ

తెలంగాణలోని మహిళలకు గొప్ప అవకాశాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో ఎస్బిఐ ట్రైనింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ట్రైనింగ్ తో పాటు అనంతరం ఉపాధి అవకాశాలను కల్పించేలా శిక్షణా కార్యక్రమాన్ని ఎస్బిఐ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు మాత్రమే ఈ శిక్షణకు అర్హులుగా ఎస్బిఐ పేర్కొంది. SBI RSETI సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న ఉచిత శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటన ప్రకారం మహిళల కోసం ఉచిత మెహంది, మగ్గం వర్క్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకునే మహిళలు, v ఆసక్తి ఉన్నవాళ్లు ఏప్రిల్ 20వ తేదీలోగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలని ఎస్బిఐ అధికారులు సూచించారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని మహిళలకు గొప్ప అవకాశాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో ఎస్బిఐ ట్రైనింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ట్రైనింగ్ తో పాటు అనంతరం ఉపాధి అవకాశాలను కల్పించేలా శిక్షణా కార్యక్రమాన్ని ఎస్బిఐ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు మాత్రమే ఈ శిక్షణకు అర్హులుగా ఎస్బిఐ పేర్కొంది. SBI RSETI సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న ఉచిత శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటన ప్రకారం మహిళల కోసం ఉచిత మెహంది, మగ్గం వర్క్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకునే మహిళలు, v ఆసక్తి ఉన్నవాళ్లు ఏప్రిల్ 20వ తేదీలోగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలని ఎస్బిఐ అధికారులు సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలు మాత్రమే ఈ శిక్షణకు అర్హులుగా ఎస్బిఐ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 28 నుంచి మే 28వ తేదీ వరకు నెల రోజులు పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ శిక్షణలో పాల్గొనాలనుకునే మహిళల వయసు 19 నుంచి 45 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలి. శిక్షణకు ఎంపికైన మహిళలకు శిక్షణ కాలంలో ఉచిత శిక్షణతో పాటు భోజనం వసతి సదుపాయాలను కల్పించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం ఉపాధి పొందే మార్గాలను అందించే ఉద్దేశంతోనే ఎస్బిఐ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రానున్న రోజుల్లో మిగిలిన జిల్లాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలను చేపట్టి వయోచనలో ఎస్బిఐ ఉంది. ఆసక్తి ఉన్న మహిళలు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, టీటీడీసీ బిల్డింగ్స్, మహిళా ప్రాంగణం, రాంనగర్ కాలనీ, నల్లగొండ జిల్లా అడ్రస్ కు రావాలని అధికారులు పేర్కొన్నారు. పైన తెలిపిన వివరాలకు ఎటువంటి సందేహాలు ఉన్న మరింత సమాచారం కోసం 7032425062 నెంబర్కు సంప్రదించాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ట్రైనింగ్ కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. 

నెలరోజుల పాటు ఉచితంగా అందించే ఈ శిక్షణా కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్బిఐ అధికారులు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది మహిళలు ఉపాధి మార్గాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ఎస్బిఐ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది పూర్తిగా ఉచిత కార్యక్రమం కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెలరోజుల పాటు శిక్షణ అనంతరం ఉపాధికి సంబంధించిన మార్గాలను కూడా కల్పించేందుకు ఎస్బిఐ ప్రయత్నిస్తుందని అధికారులు వెల్లడించారు. సొంతంగానే ఉపాధి పొందిన వృత్తిలో పనిచేసుకొని ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. అలా కాకుండా వేరువేరు చోట్లకు వెళ్లి పని చేస్తామన్న ఆలోచన ఉన్న మహిళలకు ఉద్యోగ అవకాశాలను కల్పించేదిగా ఎస్బిఐ ప్రత్యేక చర్యలు చేపడుతుందని చెబుతున్నారు. మరి మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్