సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లను చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేయాల్సిందిగా ఈసీ ఆదేశించింది. కౌంటింగ్ ఏర్పాట్లను న్యూఢిల్లీ నిర్వచనం సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యవేక్షించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎన్నికల అధికారి మీనా
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లను చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేయాల్సిందిగా ఈసీ ఆదేశించింది. కౌంటింగ్ ఏర్పాట్లను న్యూఢిల్లీ నిర్వచనం సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యవేక్షించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను వేగంగా ప్రకటించేలా చర్యలు చాపట్టాలని అధికారులకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సూచించారు. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజకుమార్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం వద్దని వెల్లడించారు. జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలో కొన్నిచోట్ల ఎన్నికలకు సంబంధించి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రానికి 20 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు కేటాయించామని, పికెట్లు ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు. సున్నితమైన కేంద్రాలను గుర్తించడంతోపాటు సమస్యలు సృష్టిస్తున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికల ఫలితాల రోజు డ్రై డే గా అమలు చేస్తున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అందుబాటులో ఉండదని సీఈవో మీనా స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములు వద్ద క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పాస్ లేకుండా ఎవరిని అనుమతించవద్దని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతరయంగా విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పవర్ బ్యాక్, ఫైర్ సేఫ్టీ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అత్యవసర ఆరోగ్య సేవలు అందించేందుకు అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు సిబ్బందికి ముందగానే శిక్షణ ఇవ్వాలని, సుశిక్షితులైన ఎన్నికలు సిబ్బందితోపాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ వంటి ఐటీ పరికరాలను ముందస్తుగా లెక్కింపు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలన్నారు. కౌంటింగ్ రోజు లెక్కించే ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా ఒక క్రమ పద్ధతిలో తీసుకురావడం, ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి లెక్కింపు పూర్తి అయినట్లుగా ఆయా ఈవీఎంలపై మార్క్ చేస్తూ వెంటనే వాటిని సీల్ చేసి ఒక క్రమ పద్ధతిలో సురక్షితంగా భద్రపరచాలని సూచించారు.
అనవసరంగా ఈవీఎంలను అటు ఇటు తరలించవద్దని, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపునకు సంబంధించి ప్రత్యేకంగా టేబుల్స్ ను, స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూముల భద్రతకు త్రీ టైర్ భద్రతను ఏర్పాటు చేసినట్లు సీఈఓ తెలిపారు. ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాలు అమర్చామని, అభ్యర్థులు వారి తరపు ప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిశీలించుకునేందుకు డెకమ్ హాల్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు లేదా వారి తరఫున ప్రతినిధులు రోజుకు రెండుసార్లు స్ట్రాంగ్ రూములను ఫిజికల్ గా పరిశీలించుకునేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.