ఉత్తర భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కనిపించడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు మరి కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 5:36 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. ఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాలు, గురుగ్రామ్, యూపీలోని నోయిడాలోని అనేక ప్రాంతాల్లో భూమి తీవ్రంగా కంపించింది.
ఢిల్లీలో భయంతో బయటకు వచ్చిన ప్రజలు
ఉత్తర భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కనిపించడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు మరి కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 5:36 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. ఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాలు, గురుగ్రామ్, యూపీలోని నోయిడాలోని అనేక ప్రాంతాల్లో భూమి తీవ్రంగా కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు పరుగులు పెట్టారు. ఉలిక్కిపడే నిద్రలోంచి లేచిన ఎంతోమంది ఇంట్లో నుంచి బయటికి పారిపోయారు. భూకంపాన్ని గమనించిన ప్రజలు ప్రాణభయంతో ఆందోళనగా పరుగులు పెట్టినట్లు చెబుతున్నారు. భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్ పై నాలుగుగా నమోదయింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం న్యూఢిల్లీ కేంద్రంగా ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. భూకంపం విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు.
భూకంపం సంభవించిన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించిందని, భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. మరోసారి భూమి ప్రకంపనులు వచ్చే అవకాశం ఉందని, ఢిల్లీ సహా పరిసర ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందన్న వార్తలుతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీవ్రస్థాయిలో వస్తుందేమోనన్న భయంతో ఇళ్లల్లో ఉండేందుకు కూడా చాలామంది ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే అధికారులు మాత్రం అక్కడే ఉండి వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేసుకున్నారు. స్వల్పంగా మాత్రమే భూకంపం సంభవించే అవకాశం ఉందని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అక్కడ అధికారులు ప్రజలకు తెలియజేస్తున్నారు.