ఏపీలో నవంబర్ ఆరో తేదీన డీఎస్సీ నోటిఫికేషన్.. 16,347 టీచర్ పోస్టులు భర్తీ

నవంబర్ ఆరో తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తంగా 16,347 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పోస్టుల రోస్టర్ వివరాలు సమర్పించాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతున్నట్టు అయింది.

Chandrababu signing regarding dsc

డీఎస్సీ విడుదలకు సంబంధించి సంతకం చేస్తున్న చంద్రబాబు

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పలు హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పెన్షన్ పథకాన్ని అమలు చేసింది. తాజాగా మరో కీలక హామీ అయిన మెగా డీఎస్సీ విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నవంబర్ ఆరో తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తంగా 16,347 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పోస్టుల రోస్టర్ వివరాలు సమర్పించాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతున్నట్టు అయింది. మరోవైపు నవంబర్ రెండో తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలు విడుదల చేసిన తర్వాత డీఎస్సీ ప్రకటిస్తే కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకునే వీలుకొలుకుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మూడు నుంచి నాలుగు నెలల్లో డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త టీచర్లకు శిక్షణ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే సమయానికి వారికి పాఠశాలలో బాధ్యతలు అప్పగించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్త టీచర్లు వస్తే ప్రధానంగా ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయ స్కూల్లో ఇబ్బందులు పరిష్కారం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 12 వేల పాఠశాలలో ఒకే టీచర్తో నడుస్తున్నాయి. ఒక టీచర్ సెలవు పెడితే ఆరోజు బడి మూసేయాల్సి వస్తోంది. కొత్త డీఎస్సీలో చాలా పాఠశాలకు రెండో టీచర్ ను ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత తీరే అవకాశం ఉంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది అందుకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టింది అయితే కొత్తగా టెట్ రాసేవారికి అవకాశం కల్పించాలని అభ్యర్థులు కోరడంతో మూడు నెలలు వాయిదా వేసింది ఇటీవల టెట్ ముగియడంతో ఇప్పుడు డీఎస్సీ విడుదలకు సిద్ధమవుతుంది. ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష తుది కీ విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. దీనిని పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచారు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది కీ విడుదల చేశామన్నారు. నవంబర్ 2న టెట్ ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్