ఇండియా కూటమిలో బేధాభిప్రాయాలు.. బీజేపీకి అప్రతిహత విజయాలు.!

దేశంలో ఒకవైపు భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. ఆ పార్టీ విజయాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీలు పరస్పరం పొట్లాడుకుంటూ బిజెపికి విజయాలను మరింత దగ్గర చేస్తున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ఒకవైపు ప్రతి ఎన్నికకు బలంగా తయారవుతుంటే.. ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ఒక్కో రాష్ట్రానికి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బలహీనపడుతూ వస్తోంది. ఈ పరిస్థితులే ఇండియా కూటమి కొనసాగడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. బిజెపిని ఓడించాలన్న కసి ఇండియా కూటమిలోని పార్టీలన్నింటికీ ఉంది.

 symbolic image

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో ఒకవైపు భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. ఆ పార్టీ విజయాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీలు పరస్పరం పొట్లాడుకుంటూ బిజెపికి విజయాలను మరింత దగ్గర చేస్తున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ఒకవైపు ప్రతి ఎన్నికకు బలంగా తయారవుతుంటే.. ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ఒక్కో రాష్ట్రానికి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బలహీనపడుతూ వస్తోంది. ఈ పరిస్థితులే ఇండియా కూటమి కొనసాగడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. బిజెపిని ఓడించాలన్న కసి ఇండియా కూటమిలోని పార్టీలన్నింటికీ ఉంది. కానీ కలిసికట్టుగా పోటీ చేసి ఓడించాలన్న భావన ఆ పార్టీలో లేకపోవడమే.. బిజెపి విజయ పరంపరకు కారణమవుతోంది. మొన్నటికి మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో, ఆ తరువాత జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లోను, తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ప్రతిపక్ష పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో లబ్ధి పొందుతోంది అన్న విషయాన్ని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 45.56 శాతం ఓటింగ్ తో 48 స్థానాలను దక్కించుకుంది.

ఆమ్ ఆద్మీ పార్టీ 43.57 శాతం ఓట్లను సాధించి 22 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ 6.34 శాతం ఓట్లను సాధించి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన ప్రతిచోట భారతీయ రాష్ట్ర సమితి భారీగానే లబ్ది పొందింది. కాంగ్రెస్ పార్టీ చీల్చిన ఓట్లతో 14 స్థానాల్లో ఆప్ నష్టపోవాల్సి వచ్చింది. ఈ స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అదే ఇండియా కూటమిగా ఆప్, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసి ఉంటే ఢిల్లీ పీఠాన్ని మరోసారి ఇండియా కూటమి దక్కించుకుని ఉండేది. కానీ ఇక్కడ కూటమి ఏర్పాటు కావడంలో విఫలం అయ్యారు. ఇదే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మరో రాష్ట్రం చేరేందుకు కారణమైంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా చేసిన ఒక ప్రకటన కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. 'ఇంకా మీలో (కాంగ్రెస్ - ఆప్) కొట్టుకుంటూనే ఉండండి. ఎవరో ఒకరు నాశనమయ్యే వరకు ఇలాగే చేయండి' అంటూ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమిలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను తేటతెల్లం చేస్తున్నాయి. బిజెపిని గద్దె దించాలి అన్న కోరిక కంటే.. మనలో ఎవరు పై చేయి సాధించాలి అన్నదే ఇండియా కూటమిలోని పార్టీల వ్యవహార శైలిగా ఉంది. ఇదే ఇప్పుడు ఇండియా కూటమి పతనావస్థకు పడిపోయేందుకు కారణమవుతోంది. 

జాతీయస్థాయిలో ఒకలా, రాష్ట్రాల్లో మరోలా ఇండియా కూటమి పార్టీ సిద్ధాంతాలు ఉండటం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న ఇండియా కూటమి ఉనికి ఢిల్లీలో ఆప్ ఓటమితో ప్రశ్నార్ధకంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో 28 విపక్ష పార్టీలు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. అప్పుడే అందులోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టిఎంసి, డీఎంకే, సమాజ్వాది పార్టీ, ఆత్మహత్య సేట్ల పంపకంపై విభేదాలు వచ్చాయి. ఎట్టకేలకు ఆ కూటమి బిజెపిని సొంతంగా అధికారంలోకి రానివ్వకుండా చేయగలిగాయి. కానీ ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికలతో ఇండియా కూటమిలో బీటలు ఎక్కువయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బిజెపి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించే పరిస్థితి లేకుండా పోయింది. హర్యానా, పంజాబ్లో కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగా పోటీ చేయడంతో రెండు ప్రధాన పార్టీల మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఢిల్లీలోనూ అదే పరిస్థితి.

ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ ఆప్, కేజ్రీవాల్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేయడం అనేక ఇబ్బందులకు కారణమవుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కూటమిలో కీలకమైన సమాజ్వాది పార్టీ, టీఎంసీలు ఢిల్లీలో కాంగ్రెస్ ను కాదని ఆప్ కు మద్దతు ప్రకటించాయి. ఇండియా కూటమికి ఎవరు నేతృత్వం వహించాలన్న దానిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై ఇండియా కూటమి కొనసాగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇండియా కూటమిలోనే ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు కూటమి పనితీరుపై ఎప్పటికే బహిరంగంగా విమర్శలు చేశారు. కూటమిలోని ఇతర పార్టీల నాయకుల ఆలోచన కూడా అలానే ఉంది. కాంగ్రెస్ పార్టీతో జతకట్టి వెళ్లడం వలన ఉపయోగం లేదన్న భావనకు మెజారిటీ పార్టీలు వెళుతున్నాయి. ఇదే ఇప్పుడు కూటమి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇది భవిష్యత్తు రాజకీయాలకు ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. మరి కూటమి బలోపేతం కావడంపై దృష్టి సారిస్తారా.? ఓటమి బలాన్ని పెంచేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఇండియా కూటమిలో ఏర్పడిన లుకలుకలు భారతీయ జనతా పార్టీ అద్వితీయమైన మెజారిటీతో విజయాలను సాధించేందుకు అవకాశాలను కల్పిస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్