బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ అప్పగించకపోవడం పట్ల ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. షేక్ హసీనాను తమకు అప్పగించే విషయంలో భారతదేశం ఆలస్యం చేస్తోందని, ఆమెను అప్పగించే ఉద్దేశం భారత్ కు ఉందా.? లేదా.? అని ప్రభుత్వ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలను వెలువరించింది. బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండి తౌహీద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ హసీనాను బంగ్లాకు రప్పించడానికి యూనస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని పేర్కొన్నారు.
తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ అప్పగించకపోవడం పట్ల ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. షేక్ హసీనాను తమకు అప్పగించే విషయంలో భారతదేశం ఆలస్యం చేస్తోందని, ఆమెను అప్పగించే ఉద్దేశం భారత్ కు ఉందా.? లేదా.? అని ప్రభుత్వ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలను వెలువరించింది. బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండి తౌహీద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ హసీనాను బంగ్లాకు రప్పించడానికి యూనస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని పేర్కొన్నారు. ఆమెను బంగ్లాకు అప్పగించాలని భారత్ ను ఎన్నిసార్లు అడిగినా జవాబు లేదని అసహనం వ్యక్తం చేశారు. హసీనాను అప్పగించాలా..? వద్దా.? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారతదేశంపైనే ఉందని వ్యాఖ్యానించారు. తమ న్యాయ వ్యవస్థ తలుచుకుంటే ఆమెను ఎలాగైనా తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ కు భారత్ తో వివిధ ఒప్పందాలు, చట్టపరమైన ప్రక్రియలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. హసీనా భారత్ లో ఎక్కడ తలదాచుకున్నారనే విషయం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి తెలుసా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో.. ఆ విషయాన్ని భారత్ ను అడగండి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హసీనా ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో ఆమె దేశం వదిలి పారిపోయి భారత్ లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఆమె తొలుత రష్యా వెళ్లాలని భావించినప్పటికీ ఆ దేశం నుంచి అనుమతి రాకపోవడంతో భారత్ కు ఆమె వెళ్లిపోయారు. అయితే, బంగ్లాదేశ్ హసీనా, ఆమె బంధువుల దౌత్య పాస్పోర్టులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమెను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం తీవ్రస్థాయిలో ప్రయత్నాలను సాగిస్తోంది. ఈ క్రమంలోనే విదేశీ వ్యవహారాల సలహాదారు ఈ వ్యాఖ్యలను చేశారు.
ద్వైపాక్షిక సంబంధాల అంశంలో కీలక పాత్ర..
భారత్ తో బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల విషయంలో హసీనా అప్పగింత అంశం కీలక పాత్ర పోషిస్తుందని బిఎన్పి ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమెకు భారత్ లోనే ఆశ్రయం కొనసాగితే భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని స్పష్టం చేశారు. న్యూఢిల్లీతో బలమైన సంబంధాలను బిఎన్పి కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. హసీనా హయాంలో రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యుల మరణాలకు హసీనానే కారణమని ఆరోపిస్తూ పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆమెతోపాటు మాజీ మంత్రులు, అనుచరులపై పోలీసులు 31 కేసులు నమోదు చేశారు. మొత్తంగా హసీనా ప్రస్తుతం 53 కేసులను ఎదుర్కొంటున్నారు. వీటిలో 44 హత్య కేసులు, మారణ హోమానికి సంబంధించిన ఏడు కేసులతోపాటు బీఎంపీ పార్టీ ఊరోగింపు సమయంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఆమెపై దాడి కేసు నమోదయింది. ఈ వ్యవహారాల నేపథ్యంలోనే ఆమెని తిరిగి భారత్ కు తీసుకువచ్చేందుకు తాత్కాలిక ప్రభుత్వం తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది. ఈ మేరకు భారత్ స్పందించాలంటే అక్కడే తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు కోరుతున్నారు.