శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా పేరు పొందిన నాయకుల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు. పలుమార్లు మంత్రిగాను పని చేసిన ఆయన 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఒకానొక దశలో ఆయన జనసేనలోకి వెళ్తున్నారన్న ప్రచారము జరిగింది.
పాలకొండలో జగన్ తో ధర్మాన
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా పేరు పొందిన నాయకుల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు. పలుమార్లు మంత్రిగాను పని చేసిన ఆయన 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఒకానొక దశలో ఆయన జనసేనలోకి వెళ్తున్నారన్న ప్రచారము జరిగింది. అందుకు అనుగుణంగానే ఆయన సైలెంట్ కావడం కూడా ఆ ప్రచారానికి మరింత ఊపును తెచ్చింది. అయితే అనూహ్యంగా గురువారం పాలకొండ పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ధర్మాన ప్రసాదరావు కలిశారు. ఆయనను కలిసి పలు విషయాలను మాట్లాడారు. దీంతో ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి పుల్ స్టాప్ పడినట్టు అయింది. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ చెబుతూ వచ్చిన ధర్మాన ప్రసాదరావు ఒక్కసారిగా యాక్టివ్ కావడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి అన్న దానిపై జోరుగా విశ్లేషణలో సాగుతున్నాయి. కొద్దిరోజుల కిందటి వరకు ధర్మాన ప్రసాదరావును కలిసిన కార్యకర్తలు, నాయకులకు ఆయన ఒకటే చెబుతూ వచ్చారు.. రెండేళ్ల వరకు తాను యాక్టివ్ కాలేనని స్పష్టం చేశారు.
దీంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు జరిగిన వైసీపీ శ్రేణులు రోడ్డు ఎక్కలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ నియోజకవర్గంలో కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో మాజీ రాజ్యసభ ఎంపీ, శ్రీకాకుళం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖర్ ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ పాలకొండలోని వారి ఇంటికి వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా అనూహ్యంగా ధర్మాన ప్రసాదరావు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మొన్నటి వరకు వైసీపీకి చెందిన ఎంతో మంది నాయకులు ఆయనను కలిసి పార్టీలో యాక్టివ్ కావాలంటూ చెప్పినప్పటికీ సైలెంట్ గా ఉండిపోయిన ఆయన.. ఇప్పుడు అనూహ్యంగా జగన్ పర్యటనలో కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అన్న భావనతోనే మళ్లీ ధర్మాన ప్రసాదరావు యాక్టివ్ అవుతున్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
2024 ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి వైసిపియే కారణం అన్న భావనలో మన వరకు ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. తాను ఎంతో చేశానని, ఇంటింటికి తిరిగామని అయినప్పటికీ ఫలితాలు దారుణంగా రావడంతో ఆయన చేరుకోలేకపోయారు. అయితే తాజాగా జగన్ పర్యటనలో ధర్మాన ప్రసాదరావు ఒక్కసారి యాక్టివ్ కావడం వెనుక కీలకమైన కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ధర్మాన రాజకీయంగా యాక్టివ్ కావాలంటూ జగన్మోహన్ రెడ్డి పలువురు నేతలు ద్వారా ఆయనకి చెప్పించారు. అయినప్పటికీ ఆయన వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో ధర్మానను వదులుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధపడినట్లు తెలిసింది. ఒకవేళ అదే జరిగితే రాజకీయంగా తనకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతోనే ధర్మాన ప్రసాదరావు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కలిసి యాక్టివ్ అయ్యేందుకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.
ధర్మాన ప్రసాదరావు వ్యవహార శైలి వల్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన్ని కృష్ణదాస్ పదవికి కూడా ముప్పు పొంచి ఉందని ప్రచారం జరిగింది. ధర్మాన కృష్ణ దాస్ స్థానంలో జిల్లా కొత్త అధ్యక్షుడిగా మరొకవైపు అధినాయకత్వం చూస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా తనతోపాటు తన సోదరుడుకు ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతోనే మళ్లీ ధర్మాన ప్రసాదరావు యాక్టివ్ అయినట్లు చెబుతున్నారు. అదే సమయంలో తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు యాక్టివ్ అవుతుండడంతో రాజకీయంగా జిల్లాలో తమ ఆధిపత్యానికి గండిపడుతుందని ధర్మాన ప్రసాదరావు భావించారు. ఇటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే వైసీపీలో కొనసాగడమే మేలు అన్న భావనతోనే ధర్మాన ప్రసాదరావు మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యే నిర్ణయాన్ని తీసుకొని జగన్ పర్యటనలో మెరిసినట్లు చెబుతున్నారు.