మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తజనం.. 15 రోజుల్లో వచ్చిన భక్తులు ఎందరో తెలుసా.!

హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక పండగ మహా కుంభమేళాకు భక్తకోటి జనం తరలివస్తున్నారు. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు మహా కుంభమేళాకు హాజరై పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. ఈనెల 14వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళా వచ్చేనెల 26 వరకు జరగనుంది. మహా కుంభమేళా ప్రారంభమై 15 రోజులు పూర్తయింది. 15 రోజుల్లో ఎంతమంది భక్తులు ఎక్కడికి వచ్చే స్నానాలు ఆచరించాలన్న దానిపై దేశవ్యాప్తంగా సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Devotees who perform rituals in Kumbh Mela

కుంభమేళాలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు

హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక పండగ మహా కుంభమేళాకు భక్తకోటి జనం తరలివస్తున్నారు. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు మహా కుంభమేళాకు హాజరై పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. ఈనెల 14వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళా వచ్చేనెల 26 వరకు జరగనుంది. మహా కుంభమేళా ప్రారంభమై 15 రోజులు పూర్తయింది. 15 రోజుల్లో ఎంతమంది భక్తులు ఎక్కడికి వచ్చే స్నానాలు ఆచరించాలన్న దానిపై దేశవ్యాప్తంగా సర్వత్ర ఆసక్తి నెలకొంది. గడిచిన 15 రోజుల్లో దాదాపు 14 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారని సనాతన పేర్కొంది. సోమవారం ఒక్కరోజే 1.55 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారు. ఇందులో 10 లక్షలు కల్ప వాసీలు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే 14.76 కోట్లమంది స్నానాలను ఆచరించినట్లు చెబుతున్నారు. 

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది.. ఈ కుంభమేళా వచ్చేనెల 26 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 23 నాటికి 10 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్ ను సందర్శించి పుణ్యస్నాలను పూర్తి చేశారు. మకర సంక్రాంతి రోజు అత్యంత పవిత్రమైనది కావడంతో 3.5 కోట్ల మంది భక్తులు వచ్చి స్నానాలను ఆచరించారు. మహా కుంభమేళ ముగిసే సమయానికి 45 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యంత వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళా పర్యాటక రంగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని చెబుతున్నారు. గడిచిన ఏడాది ఉత్తరప్రదేశ్లోని పర్యాటక ప్రాంతాలను 65 కోట్ల మంది భక్తులు, పర్యాటకులు సందర్శించారు. ఈ రికార్డును కొద్దిరోజుల్లోనే అధిగమించే అవకాశం మహా కుంభమేళా ద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి దక్కినట్టు అయిందని చెబుతున్నారు. 

ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు వస్తున్నప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ పుణ్యస్నానాలు పూర్తి చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గడిచిన కొన్ని నెలల నుంచే మహా కుంభమేళా కోసం భారీ ఎత్తున ఏర్పాట్లను పూర్తి చేసింది. పెద్ద ఎత్తున ఘాట్లు సిద్ధం చేసింది. రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. భక్తులు ఎవరు ఇబ్బందులు పడకుండా ఇక్కడ గుడారాలతో ఒక నగరాన్ని ఏర్పాటు చేయించింది. దీంతో భక్తులు ఎవరు ఇబ్బందులు పడకుండానే పుణ్యస్నానాలను పూర్తి చేసి వెళుతున్నారు. రాష్ట్రంలోని అధికార యంత్రాంగాన్ని మొత్తం ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం దించింది. దీంతో ఎటువంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా మహా కుంభమేళ జరుగుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్