కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల గడిచిన కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారు. గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె రాజకీయంగా పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉన్నారు. ఎన్నికల ముందు, తరువాత కూడా తన అన్న, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో షర్మిల వ్యవహారశైలిపై కొన్ని వర్గాలు నుంచి, ఆ పార్టీ నాయకులు నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికారంలో ఉన్న కూటమి పార్టీ నేతలను కాకుండా జగన్ను విమర్శించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెదవి విరిచారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల గడిచిన కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారు. గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె రాజకీయంగా పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉన్నారు. ఎన్నికల ముందు, తరువాత కూడా తన అన్న, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో షర్మిల వ్యవహారశైలిపై కొన్ని వర్గాలు నుంచి, ఆ పార్టీ నాయకులు నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికారంలో ఉన్న కూటమి పార్టీ నేతలను కాకుండా జగన్ను విమర్శించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెదవి విరిచారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఓటింగ్లో జరుగుతున్న అవకతవకలపై పెద్ద ఎత్తున వాయిస్ వినిపిస్తుంటే.. రాష్ట్ర పార్టీ అఽధ్యక్షురాలిగా ఉన్న షర్మిల మాత్రం కనీసం దీని గురించి ఎక్కడా మాట్లాడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తోంది. అయితే, ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ తరపున కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన ఆమె గడిచిన కొన్నాళ్లుగా ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడప్పుడు ట్విట్టర్లో పోస్టులు పెట్టడం, సైలెంట్ కావడం అన్నట్టుగా ఆమె వ్యవహారశైలి మారిపోయింది. పార్టీ కార్యాలయాలకు కూడా ఆమె రావడం లేదంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, వైసీపీ దారుణ స్థితికి పడిపోయిన నేపథ్యంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉంటుందన్న భావనలో ఆ పార్టీ నాయకులు, అభిమానులు ఉన్నారు.
కానీ, షర్మిల మాత్రం ఆ దిశగా ఎక్కడా ఆలోచన చేయడం లేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు ఆమె ముందుకు రావడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదం చేసిన సూపర్ సిక్స్ హామీలపై షర్మిల ఇప్పటి వరకు ఎక్కడా బలంగా ప్రశ్నించలేదు. వీటిపైనా పోరాటాలు చేయలేదు. అదే సమయంలో బయటకు కూడా ఆమె కనిపించకోవడంతో షర్మిల ఎక్కడ అన్న ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది. రాష్ట్రంలో పోరాటాలు చేసి, ప్రజల వద్దకు వెళ్లి బలపడేందుకు మంచి అవకాశాలు ఉన్నప్పటికీ షర్మిల ఎందుకు ఆ దిశగా ఆలోచన చేయడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నప్పటికీ.. ఆమె మాత్రం బయట కనిపించడం లేదు. అదే సమయంలో రాష్ట్రంలోని పార్టీ పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కూడా దృష్టి సారించకపోవడంపైనా సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా భావించే 25 పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఎందుకు కీలకంగా భావించడం లేదో అర్థం కావడం లేదంటూ ఆ పార్టీ నాయకులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి షర్మిల ప్రజల పక్షాన పోరాటం చేయకుండా, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మౌనం దాల్చడం వెనుక కారణం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి వీటికి సమాధానం ఇచ్చేలా షర్మిల బయటకు వస్తారా.? లేదా.? అన్న దానిపై వేచి చూడాల్సి ఉంది.