ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ విమర్శలు.. మరణాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్

న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తోకిసలాట ఘటనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో స్పందించారు. అటువంటి పరిస్థితుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని ఖర్గే డిమాండ్ చేశారు. మరణాలు, గాయాల సంఖ్యను వెంటనే వెల్లడించాలని కోరారు. తప్పిపోయిన వ్యక్తుల గురించి కేంద్రం సమాచారం అందించాలన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. మృతులు, గాయపడిన వారి సంఖ్యను వీలైనంత త్వరగా ప్రకటించాలని, తప్పిపోయిన వ్యక్తులు గుర్తింపును కూడా నిర్ధారించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని, ఆదిత్య కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తోకిసలాట ఘటనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో స్పందించారు. అటువంటి పరిస్థితుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని ఖర్గే డిమాండ్ చేశారు. మరణాలు, గాయాల సంఖ్యను వెంటనే వెల్లడించాలని కోరారు. తప్పిపోయిన వ్యక్తుల గురించి కేంద్రం సమాచారం అందించాలన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. మృతులు, గాయపడిన వారి సంఖ్యను వీలైనంత త్వరగా ప్రకటించాలని, తప్పిపోయిన వ్యక్తులు గుర్తింపును కూడా నిర్ధారించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని, ఆదిత్య కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఈ తరహా విషాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెళ్లి రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో చాలామంది మరణించారనే వార్త చాలా బాధాకరమని పేర్కొన్నారు. స్టేషన్ నుండి వస్తున్న వీడియోలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన మరణాల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిజాన్ని దాచడానికి ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా కూడా ఈ ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించారు. జన సమూహాన్ని నిర్వహించడానికి మెరుగైన ఏర్పాట్లు అవసరమని నొక్కి చెప్పారు.

ఢిల్లీ స్టేషన్లో తొక్కిసలాట ఘటన బాధాకరమని పేర్కొన్నారు. కుంభమేళ భారీ స్థాయిలో జరుగుతుందని తెలిసి కూడా న్యూఢిల్లీలో మెరుగైన ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. దాదాపు డజన్ మంది గాయపడినట్లు సమాచారం ఉందన్నారు. ఏదో ఒక విధంగా జనాన్ని పార్సిల్ వాహనంలో ఎక్కించి ఆసుపత్రిలో చేర్చారని, అందరూ సురక్షితంగా శ్రమిస్తానానికి చేరి ఉంటారని భావిస్తున్నామన్నారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన భారీ తో కూసులాట్లో దాదాపు 18 మంది మరణించిన విషయం తెలిసిందే. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. రైల్వే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేపీసీ మల్హోత్రా వెల్లడించిన వివరాలు ప్రకారం ప్లాట్ఫారం నెంబర్ వన్ పై పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గుమగుడినప్పుడు ఈ ఘటన జరిగిందన్నారు. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం 14 పై నిలబడి ఉందని, అంతేకాకుండా స్వాతంత్ర సేనాని, భువనేశ్వరి రాజధాని రైలలో ఆలస్యం కారణంగా మరి కొన్ని ప్లాట్ఫాములపై రద్దీ పెరిగిందని, ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగినట్టు వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్