మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై కమిటీ.. అధ్యయనానికి ముగ్గురు మంత్రులు

ఉచిత బస్సు పథకం అమలు చేసేందుకు అనుగుణంగా అధ్యయనానికి ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రవాణా శాఖ మంత్రి చైర్మెన్ గా, హోం శాఖ మంత్రి, మహిళ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. రవాణా రోడ్డు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. వీలైనంత త్వరగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నాయకులు అనేక హామీలను ఇచ్చారు. అందులో కీలకమైన హామీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం. అనుకున్నట్టుగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండగా.. మరికొన్నింటినీ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించేందుకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఈ క్రమంలోనే ఉచిత బస్సు పథకం అమలు చేసేందుకు అనుగుణంగా అధ్యయనానికి ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రవాణా శాఖ మంత్రి చైర్మెన్ గా, హోం శాఖ మంత్రి, మహిళ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. రవాణా రోడ్డు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. వీలైనంత త్వరగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మంత్రుల కమిటీ పర్యటించనుంది.

అక్కడ ఈ పథకం అమలకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులు, అక్కడ అనుసరిస్తున్న విధానాలు వంటి వాటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాష్ట్రంలో ఈ పథకం అమలకు సంబంధించి సాధ్యాసాధ్యాలను ప్రభుత్వానికి వివరించనుంది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత ఈ పథకాన్ని సంక్రాంతి పండగ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం వీటిపై ఎలా ముందుకు వెళ్లాలని దానిని నిర్ధారించేందుకు అనుగుణంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఎలా ఉంటే రాష్ట్రంలో రెండువేల ఎలక్ట్రికల్ బస్సు సర్వీసులను కొద్ది రోజుల్లోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కొత్త బస్సులు కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ బస్సు సర్వీసులో అందుబాటులోకి వస్తే వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు అవకాశం ఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్