సీఎం రేవంత్ రెడ్డి మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం

సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాతోపాటు మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఈ ప్రచారానికి సంబంధించిన గడువు ఈనెల 25 తో ముగియనుంది. ఎన్నికల ప్రచారానికి సమయం ముగిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఈ జిల్లాలో పర్యటిస్తున్నారు.

CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి 

సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాతోపాటు మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఈ ప్రచారానికి సంబంధించిన గడువు ఈనెల 25 తో ముగియనుంది. ఎన్నికల ప్రచారానికి సమయం ముగిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఈ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రణాళికలు రచించారు. ఈ స్థానాన్ని కవచం చేసుకునేలా ప్రచారాన్ని నిర్వహించడంతోపాటు అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించే బాధ్యతలను కొంతమంది నేతలకు ఆయన అప్పగించారు. సరదాగా నిర్వహిస్తున్న సభలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొననున్నారు. 

ఇది సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్..

ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు జిల్లాలకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు హైదరాబాదు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:45 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. 11:50 గంటల నుంచి 1.30 గంటల వరకు నిజామాబాద్ పట్టణంలో నిర్వహించే పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.35 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి మంచిర్యాల జిల్లాకు వెళతారు. అక్కడ 2.15 గంటలకు పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ పట్టణంలోని భూమా రెడ్డి ఫంక్షన్ హాల్ లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అధికారిక కార్యక్రమం కాకపోయినప్పటికీ పోలీసులు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్న సభలను విజయవంతం చేసేందుకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఆయన ఆయా ఏర్పాట్లను పరిశీలించడంతోపాటు కాంగ్రెస్ నేతలతోనూ సభ విజయవంతం చేసేందుకు సంబంధించిన సూచనలు చేసేందుకు సమావేశాన్ని నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చేస్తున్నారు. ప్రజా పాలన వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలను వివరించి పట్టభద్రుడు ఆలోచించి కాంగ్రెస్కు ఓటు వేయాలని సీఎం కోరనున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిచేలా ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకుని రాబోయే మూడు రోజుల్లో క్షేత్రస్థాయిలో ఓటరును కలిసి అభ్యర్థి గెలుపునుకు కార్యకర్తలు కృషిచేసేలా వ్యూహం రూపొందించి మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఈ ఎమ్మెల్యే స్థానంలో కాంగ్రెస్ పార్టీకి కాస్త జోష్ వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్