తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక పథకాన్ని ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సన్న బియ్యం పథకాన్ని ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. కేవలం దసరా, దీపావళి, సంక్రాంతి పండగ నాడే సన్న బియ్యం తినడం కాదని, పేదవాళ్లు ప్రతిరోజూ సన్న బియ్యం తినే రోజులు వచ్చాయని పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఉగాది పండగ రోజున ఈ సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పది మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు.
సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక పథకాన్ని ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సన్న బియ్యం పథకాన్ని ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. కేవలం దసరా, దీపావళి, సంక్రాంతి పండగ నాడే సన్న బియ్యం తినడం కాదని, పేదవాళ్లు ప్రతిరోజూ సన్న బియ్యం తినే రోజులు వచ్చాయని పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఉగాది పండగ రోజున ఈ సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పది మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎంగా కోట్ల విజయ భాస్కర్రెడ్డి ఒక రూపాయి 90 పైసలకే పేదలకు కిలో బియ్యం ఇవ్వాలని నిర్ణయించారన్నారు. కానీ, ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించినట్టు వెల్లడించారు. పేదలకు బియ్యం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు 1957లోనే రేషన్ దుకాణాలు ప్రారంభించినట్టు వెల్లడించారు. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దాదాపు 70 ఏళ్ల కిందటే పీడీఎఫ్ బియ్యాన్ని ఇవ్వడం ప్రారంభించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మిర్యాలగూడ, హుజూర్ నగర్ దేశంలోనే అత్యధికంగా బియ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. నల్గొండ జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో వరి పండించారని, దేశంలోనే అత్యధికంగా వడ్లు పండించే రైతులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నారన్నారు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఉచితంగా ఇస్తున్నారని పేర్కొన్నారు. కానీ, ప్రజలు ఆ బియ్యాన్ని బయట మార్కెట్లో పది రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారని, రేషన్ బియ్యంపై కోట్ల రూపాయల దందా జరుగుతోందన్నారు. ఏటా పదివేల కోట్ల రూపాయలు మేర రేషన్ బియ్యం దందా జరుగుతోందని ఆరోపించారు. దొడ్డు బియ్యానికి బదులు పేదలకు పేదలకు సన్న బియ్యం అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పండగ రోజే కాకుండా ప్రతిరోజూ పేదవాడు సన్న బియ్యం తినాలనేలా ఒకొక్కరికీ ఆరు కేజీలు చొప్పున బియ్యం ఉగాది పండగ రోజు శ్రీకారం చుట్టాలని భావించినట్టు తెలిపారు. మల్లు స్వరాజ్యం భూమి కోసం, బుక్తి కోసం, భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలు నిర్వహించిన నల్లగొండ అని పేర్కొన్నారు. క్రిష్ణపట్టి ప్రాంతం చైతన్యానికి మారుపేరన్నారు.