నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ

సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ప్రతినెలా ఒకటో తేదీన ఒక్కో జిల్లాకు వెళ్లి లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లను ఆయన పంపిణీ చేస్తున్నారు. ఈ నెలలో కూడా ఆయన అన్నమయ్య జిల్లాకు వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం లో గల సంబేపల్లి మండలంలో జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతోపాటు పలు అభివృద్ధి పనులు ఆయన పాల్గొననున్నారు.

 CM Chandrababu Naidu

సీఎం చంద్రబాబు నాయుడు

సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ప్రతినెలా ఒకటో తేదీన ఒక్కో జిల్లాకు వెళ్లి లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లను ఆయన పంపిణీ చేస్తున్నారు. ఈ నెలలో కూడా ఆయన అన్నమయ్య జిల్లాకు వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం లో గల సంబేపల్లి మండలంలో జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతోపాటు పలు అభివృద్ధి పనులు ఆయన పాల్గొననున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు నాయుడు కడప చేరుకుంటారు. అక్కడనుంచి సంబేపల్లి పీఎం కాలనీకి హెలికాప్టర్లో వెళతారు.  హెలిపాడ్ నుంచి నేరుగా సంబేపల్లికి రోడ్డు మార్గాన వెళ్ళనున్నారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించనున్నారు అనంతరం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తారు. ఈ సందర్భంగా దళిత మహిళ మంగమ్మతో పాటు బీసీ వర్గానికి చెందిన వికలాంగుడు గొర్ల వెంకటేష్ నివాసానికి చేరుకుని వారికి పెన్షన్ అందిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా కోటను ప్రభుత్వం చేపడుతోంది. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే పెన్షన్ పెంచిన ప్రభుత్వం.. ప్రతినెలా ఒకటో తేదీన లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందిస్తోంది.

ప్రతినెలా ఏదో ఒక గ్రామంలో నిర్వహించే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండగా.. సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ పరిశీలిస్తే.. ఉదయం 11.10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.05 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్తారు. 12.20 గంటలకు సంబేపల్లి మండలం పిఎన్ కాలనీకి చేరుకుంటారు. 12.40 గంటలకు సంబేపల్లి చేరుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 12.50 గంటలకు సంబేపల్లిలోని మంగమ్మ, గొర్ల వెంకటేష్ ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగర పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొంటారు. సంబేపల్లిలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభిస్తారు. అనంతరం పిఎన్ కాలనీ నుంచి హెలికాప్టర్లో కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు.  అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్ళనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్