తెలంగాణపై సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్.. ఆ నేతల భేటీ వెనుక కారణం అదేనా.!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు తన రాజకీయాన్ని పూర్తిగా ఏపీకి కేటాయించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఇతర కీలక నేతలకు అప్పగించారు. అయితే చంద్రబాబు గతంలో మాదిరిగా పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టిడిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకుంది. పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారాన్ని చెలాయించడంతో తమకు ఉన్న అనేక ఇబ్బందులు దృష్ట్యా ఎంతోమంది సీనియర్ నేతలు పార్టీని విడిచి వెళ్లిపోయారు.

TDP chief Nara Chandrababu Naidu

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు తన రాజకీయాన్ని పూర్తిగా ఏపీకి కేటాయించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఇతర కీలక నేతలకు అప్పగించారు. అయితే చంద్రబాబు గతంలో మాదిరిగా పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టిడిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకుంది. పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారాన్ని చెలాయించడంతో తమకు ఉన్న అనేక ఇబ్బందులు దృష్ట్యా ఎంతోమంది సీనియర్ నేతలు పార్టీని విడిచి వెళ్లిపోయారు. బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీలోని ఎంతోమంది నేతలు పక్క చూపులు చూస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా క్షీణిస్తోందన్న విషయాన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్కడ పార్టీని పునర్నిర్మించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. కొద్దిరోజుల కిందట తెలంగాణలోని ముఖ్య నేతలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఆదరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పార్టీ నేతలకు భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బి.ఆర్.ఎస్ కు చెందిన పలువురు ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి చంద్రబాబును కలిసి పలు అంశాలపై చర్చించారు. మల్లారెడ్డి తోపాటు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తదితరులు కలిసి వివిధ అంశాలపై మాట్లాడారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఆ నేతలు చెబుతున్నప్పటికీ రాజకీయ ప్రాధాన్యతను మాత్రం ఈ భేటీ సంతరించుకుంది. టిడిపిలో చేరేందుకు ఏ నేతల సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం ధృవీకరించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడతారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఆయన పూర్తిగా ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మల్లారెడ్డి టిడిపిలోకి చేరుతున్నారని పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. 

టిడిపిలో చేరుతున్న విషయాన్ని ధ్రువీకరించిన కృష్ణారెడ్డి..

చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసినట్లు బయటకు చెబుతున్న తెలుగుదేశం పార్టీలో చేరడం లాంచన ప్రాయమేనన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ధ్రువీకరించేలా మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి చంద్రబాబును కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో టిడిపికి పూర్వవైభవం తీసుకువస్తామని ఉద్ఘాటించారు. హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత చంద్రబాబు అని ఈ సందర్భంగా ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హయాంలోనే సైబరాబాద్, హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందాయని కృష్ణారెడ్డి కొనియాడారు. 

దారుణ ఓటమితోనే పక్క చూపులు..

పదేళ్లపాటు అధికారాన్ని చలాయించిన బిఆర్ఎస్ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే ఆ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలోనే ఎమ్మెల్యేలను గెలుచుకోవడంతో పార్టీ మనుగడకు సంబంధించిన అంశంపై పెద్దగా చర్చ జరగలేదు. ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యంత దారుణంగా ఓటమిపాలైంది. ఒక్క స్థానంలోనూ విజయం సాధించకపోవడంతో ఆ పార్టీ సీనియర్ నేతల్లో గుబులు మొదలైంది. పదేళ్లపాటు అధికారాన్ని అనుభవించిన పార్టీకి ప్రజలు ఒక్క స్థానాన్ని కూడా ఇవ్వకపోవడం పట్ల సీనియర్ నేతల్లో ఆందోళన పెరిగింది. బిఆర్ఎస్ లో ఉంటే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు ఇప్పట్లో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం లేదని భావిస్తున్న ఎంతోమంది నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మరి కొంతమంది ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు బిజెపి వైపు, టిడిపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పలువురు సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడు ను కలవడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా పార్టీ మార్పేనని పలువురు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్