వాట్సాప్ ద్వారా ఇకపై పౌర సేవలు.. కీలక ఆదేశాలు జారీచేసిన సీఎం చంద్రబాబు

ఏపీలో ప్రజలకు అందించే పౌర సేవలను మరింత సులభంగా పేదలకు చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ తరహాలో సేవలు అందించనున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలవనుంది. అందుకు అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది.

Agreement for WhatsApp services

వాట్సప్ సేవలకై మంత్రి సమక్షంలో ఒప్పందం

ఏపీలో ప్రజలకు అందించే పౌర సేవలను మరింత సులభంగా పేదలకు చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ తరహాలో సేవలు అందించనున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలవనుంది. అందుకు అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల్లోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక నెంబర్ ను కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రభుత్వం తీసుకురానున్న ఆ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ (టిక్ మార్క్) ఉంటుంది. ఈ నెంబరు వన్ స్టాప్ సెంటర్ మాదిరిగా పనిచేయనుంది. తొలి దశలో ఇందులో 153 రకాల సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. భవిష్యత్తులో మరిన్ని సేవలను ఇందులో యాడ్ చేసుకుంటూ వెళ్ళనున్నారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా ఈ మేరకు ఆర్టిజిఎస్ సీఈవో దినేష్ కుమార్ ఈ సేవలకు సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చారు. 

వాట్సాప్ ద్వారా కొన్ని రకాల సేవలను అందించమన్నారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం అంటే భారీ వర్షాలు, వరదల ముప్పు, విద్యాసంస్థలకు సెలవులు, విద్యుత్ సబ్స్టేషన్ల మరమ్మత్తులు కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం, వైరస్లు వ్యాప్తి, పిడుగులు పడే సమాచారం, అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ సమాచారంగా వినియోగదారులకు చేరవేయనున్నారు. అలాగే ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్కు మెసేజ్ చేస్తే వారికి వెంటనే ఒక లింకు వస్తుంది. అందులో సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్ నెంబరు, చిరునామా పొందుపరచాల్సి ఉంటుంది. సమస్యను అందులో తెలియజేస్తే వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాని ఆధారంగా తాము ఇచ్చిన వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చింది, ఎవరు వద్ద  ఉందనే విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది.

వీటితోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు, అర్హతలు పథకాల లబ్ధి గురించి ఈ వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సాప్ లో పంపించనున్నారు. నచ్చిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని అక్కడే టికెట్లు, వసతి సహా అన్ని బుక్ చేసుకుని సదుపాయం కల్పించనున్నారు. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు ఈ అధికారిక వాట్స్అప్ ద్వారా చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ట్రేడ్ లైసెన్సులు పొందవచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్ బుకింగ్, వసతి బుకింగ్ విరాళాలు పంపడం వంటివి చేసే అవకాశాన్ని కల్పించనుంది. రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డుల యాక్సిస్ సర్టిఫికెట్లు పొందేలా వాట్సప్ ద్వారా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం తీసుకురానున్న ఈ విధానం వల్ల వినియోగదారులకు ఎంతో మేలు చేకూరుతుందని చెబుతున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ వాట్సాప్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్