అధికారులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

వరద బాధితుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొన్నిచోట్ల ఆహారం పంపిణీ సరిగా జరగలేదని, అనేక చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై అధికారులు సరిగా స్పందించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని చంద్రబాబు హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వరద బాధితుల కోసం ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన వివరించారు.

Chief Minister Nara Chandrababu Naidu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

వరద బాధితుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొన్నిచోట్ల ఆహారం పంపిణీ సరిగా జరగలేదని, అనేక చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై అధికారులు సరిగా స్పందించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని చంద్రబాబు హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వరద బాధితుల కోసం ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. నగరంలో డివిజన్ కు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించామని చంద్రబాబు వెల్లడించారు. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని స్పష్టం చేశారు. పది జిల్లాల నుంచి ఆహారాన్ని సమకూర్చామని, బాధితులకు మూడు పూటలా అందించాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. చివరి బాధితుడికి సాయం అందాలని ఆదేశించారు. బాధితులకు సహాయం అందించడంలో నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. వరదలతో పేదల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. కొన్ని ఇళ్లల్లోకి పాములు, తేలు వచ్చాయని వివరించారు. అధికారులంతా మానవతా దృక్పథంతో పనిచేయాలని, అందుతున్న సహాయం పై ఐవిఆర్ఎస్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కొన్ని ప్రాంతాలకు ఇంకా ఆహారం అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆహారం అందని బాధితుల నంబర్లు అధికారులకు పంపిస్తున్నామని, ఇబ్బందులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. అధికారులకు రెండు రోజులుగా చెబుతున్నామని, అయినప్పటికీ పలువురు సరిగా పనిచేయడం లేదని పేర్కొన్నారు. ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని, మీనమేషాలు లెక్కించడం సరికాదని స్పష్టం చేశారు. 

కుట్రలు జరుగుతున్నాయన్న చంద్రబాబు..

ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తారా.? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ లో బోట్ల ఘటనపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. బాబాయిని చంపిన వారు ఉన్నప్పుడు అనుమానాలు వస్తాయి కదా అని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విపక్ష నేత ఐదు నిమిషాలు వచ్చి షో చేసి వెళ్లిపోయారని, ఆయన ఒక్కరికి కూడా ఆహార పొట్లం ఇవ్వలేదన్నారు. ప్రధాన మోడీ తో మాట్లాడినప్పుడు మీరు ఉన్నారు కదా భయం లేదని చెప్పారని, కొద్దికొద్ది సమయంలో తన పనితీరు ఆయన మెచ్చుకున్నారన్నారు. తన పట్ల ప్రజల స్పందన చూసి ప్రధాని ఆశ్చర్యపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడ పర్యటనలో భాగంగా సితార సెంటర్ కు సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్