వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మంగళగిరి సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కాకినాడ పోర్టు వ్యవహారాలకు సంబంధించి విచారణలో భాగంగా సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే రాజకీయంగా ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కోలేక కొద్ది రోజుల కిందట ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇకపై పూర్తి జీవితాన్ని వ్యవసాయానికి కేటాయిస్తానని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి నిర్ణయంతో ఒక్కసారిగా వైసీపీ నాయకులతోపాటు శ్రేణులు షాక్ కు గురయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసిపి ప్రభుత్వాలు లెక్కలను తేల్చే పనిని చేపట్టింది.
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మంగళగిరి సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కాకినాడ పోర్టు వ్యవహారాలకు సంబంధించి విచారణలో భాగంగా సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే రాజకీయంగా ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కోలేక కొద్ది రోజుల కిందట ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇకపై పూర్తి జీవితాన్ని వ్యవసాయానికి కేటాయిస్తానని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి నిర్ణయంతో ఒక్కసారిగా వైసీపీ నాయకులతోపాటు శ్రేణులు షాక్ కు గురయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసిపి ప్రభుత్వాలు లెక్కలను తేల్చే పనిని చేపట్టింది. అందులో భాగంగానే కాకినాడ పోర్టుకు సంబంధించిన వాటాల విషయంపై అప్పట్లో దుమారం రేగింది. దీనిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం కాకినాడ వ్యవహారాలపై విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కెవి రావు అప్పట్లో విజయసాయిరెడ్డి పై ఫిర్యాదు చేశారు. తన దగ్గర నుంచి పోర్టు వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారంటూ ఆయన ఫిర్యాదు చేయడంతో ఏపీ కూటమి ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఈ కేసు వ్యవహారం ముందుకు సాగలేదు. విజయసాయిరెడ్డి కూడా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు రాజకీయాలకు దూరంగా వెళ్లాలని నిర్ణయించుకొని ఆ మేరకు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. విజయసారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నానని ప్రకటించినప్పటికీ కేసుల వ్యవహారాలు మాత్రం ఆయనను వదిలిపెట్టడం లేదు. తాజాగా విజయ్ సాయి రెడ్డికి సిఐడి పోలీసులు నోటీసులను జారీ చేశారు. ఈనెల 12వ తేదీ 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. విజయసాయి రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120 (B), రెడ్ విత్ 34 బి.ఎన్.ఎస్ సెక్షన్లు ప్రస్తావించారు.
దీంతో మరోసారి విజయసాయిరెడ్డి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలను వదిలేసిన కేసులు మాత్రం విజయసాయిరెడ్డిని వదలడం లేదు అంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పోర్టు వాటాల అక్రమ బదిలీపై సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి తో పాటు విజయసాయిరెడ్డి పై మంగళగిరి సిఐడి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే విచారణ నిమిత్తం విజయసాయి రెడ్డికి తాజాగా సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులకు సంబంధించి విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంది. విజయసాయిరెడ్డి సిఐడి అధికారుల విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై ప్రస్తుతం తెగ ఉత్కంఠ రేగుతోంది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయ్ సాయి రెడ్డి రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయినప్పటికీ ఈ కేసు విచారణ ముందుకు సాగుతూ ఉండడం పట్ల సర్వత్ర చర్చ జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతోనే ఆయన రాజకీయాలకు దూరమయ్యారు అన్న ప్రచారం ఉంది. అయినప్పటికీ ఈ కేసు మరోసారి విచారణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభం కావడం పట్ల ఆయన కుటుంబ సభ్యుల్లో ఆందోళన రక్తం అవుతున్నట్లు చెబుతున్నారు.