యుద్ధం వస్తే భారత్ ను ఇక్కట్లకు గురి చేసే కీలక నిర్ణయాన్ని చైనా తీసుకుంది. అదే బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద డ్యామ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్తు డ్యామ్ ను ఈ నదిపై నిర్మించేందుకు సిద్ధమవుతోంది. త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు పెద్దదిగా ఈ డ్యాం నిర్మాణానికి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు.
త్రీ గోర్జెస్ డ్యామ్
చైనా తన నక్క బుద్ధులను చూపిస్తోంది. గడచిన కొన్నాళ్లుగా భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ ను ఇబ్బందులు పెట్టే చర్యలకు చైనా సిద్ధమవుతోంది. ఒకవైపు భారత్ సరిహద్దు దేశాలతో సన్నిహిత సంబంధాలను నెరపుతూ ఇబ్బందులు పెట్టాలని రీతిలో వ్యవహారాలను సాగిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న చైనా.. భారత్ ను ఇబ్బందులు పెట్టే విధంగా అనేక చర్యలకు పాకిస్తాన్ పాల్పడేలా చేస్తోంది. తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న అంతర్గత సమస్య వెనుక చైనా కుట్ర దాగి ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ తాత్కాలిక ప్రధానిగా ఉన్న యూనస్ భారత వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఒకవైపు భారతదేశం చుట్టూ ఉన్న దేశాలతో వ్యాపార, వాణిజ్య, దౌత్యపరమైన సత్సంబంధాలను కొనసాగిస్తూ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు యుద్ధం వస్తే భారత్ ను ఇక్కట్లకు గురి చేసే కీలక నిర్ణయాన్ని చైనా తీసుకుంది. అదే బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద డ్యామ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్తు డ్యామ్ ను ఈ నదిపై నిర్మించేందుకు సిద్ధమవుతోంది. త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు పెద్దదిగా ఈ డ్యాం నిర్మాణానికి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు.
టిబేట్ ప్రాంతంలో భారత సరిహద్దుకు సమీపంలో ఈ డ్యామ్ ను నిర్మించేందుకు చైనా సిద్ధమవుతోంది. టిబేట్ తూర్పు అంచులో ఉన్న యార్లగు జాంగ్బో నది దిగువ భాగంలో ఈ జలాశయాన్ని నిర్మించనున్నట్లు చైనా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 137 బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టుగా ఈ డ్యామ్ నిలుస్తుందని పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ అని 2020లో చైనా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అంచనా వేసింది. ప్రస్తుతం చైనాలో ఉన్న అతిపెద్దదైన త్రీ గోర్జెస్ డ్యామ్ సామర్థ్యం 88.2 విలియం కిలోవాట్ అవర్స్. అంటే కొత్త డ్యాం సామర్థ్యం దానికి మూడు రెట్లు అధికం. హిమాలయాల్లో బ్రహ్మపుత్ర నది పెద్ద యూటర్న్ తీసుకొని ఆరుణాచల్ ప్రదేశ్, అసోం గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. యూటర్న్ తీసుకునే ప్రాంతంలో భారీ లోయ వద్ద డ్యామ్ నిర్మించాలని చైనా నిర్ణయించింది. 137 బిలియన్ డాలర్ల (చైనా కరెన్సీలో రిలియన్ యువాన్లు) ఖర్చుతో నిర్మించి ఉన్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి ఖరీదైన, భారీ ప్రాజెక్టుగా నిలవనుంది. యార్లాంగ్ జాంబ్బో నదిపై ప్రాజెక్టు నిర్మించారు తలపెట్టిన ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక జల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉన్నవాటిలో ఒకటి అని చైనా పవర్ కన్స్ట్రక్షన్ అంచనా వేసినట్లు చైనా మీడియా వెల్లడించింది. జల విద్యుత్ ఉత్పత్తి కోసం బ్రహ్మపుత్ర నదిలోని సగం నీటిని దారి మళ్లించేందుకు 20 కిలోమీటర్ల పొడవైన సొరంగాలను నాలుగు నుంచి 6 వరకు తవ్వాలని పేర్కొంది. నమ్ చా బార్వా కొండల్లో తవ్వే ఈ సొరంగాలు ద్వారా సెకనుకు 2000 క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహిస్తుందని వివరించింది. ఈ ప్రాజెక్టు కేవలం జల విద్యుత్తు డామ్ మాత్రమే కాదని, పర్యావరణానికి, చైనా జాతీయ భద్రతకు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, ఇంధనం, అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన ప్రాజెక్టు అని చైనా పవర్ కన్స్ట్రక్షన్ కంపెనీ గత చైర్మన్ యాన్ జియాంగ్ పేర్కొన్నారు.
చైనా తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి ఇబ్బందికరంగా మారుతుందన్న విశ్లేషణలు నిపుణులు వినిపిస్తున్నారు. టిబేట్ లో జన్మించిన బ్రహ్మపుత్ర నది భారత్ గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తోంది. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ఇది వరదాయిని. ఈ నది జలాల ప్రవాహ తీరు, పంపిణీ వంటి అంశాలపై సమాచార మార్పిడి కోసం భారత్ - చైనా మధ్య ఒప్పందం ఉంది. వర్షాకాలంలో ఈ నదికి విపరీతంగా వరదలు వస్తుంటాయి. ఇరదేశాల మధ్య ఒప్పందం ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర జలాల సంబంధిత విషయాల్ని చైనా భారత్ తో పంచుకోవాల్సి ఉంది. వరదలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు నదిలో ప్రవాహ స్థితిగతులను దిగువునున్న దేశాలకు తెలియజేయాలి. కానీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని సరిగా ఇవ్వడం లేదు. బ్రహ్మపుత్ర నది జలాలపై తొలిసారిగా 2002లో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తరువాత 2008, 2013, 2018లో నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. చివరిసారిగా కుదిరిన ఒప్పందం 2023తో ముగిసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంకా కొత్త ఒప్పందం జరగలేదు. ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవడం కలవరు పెడుతుంది. చైనా ప్రతిపాదిత ప్రాజెక్టును పూర్తిచేస్తే భారత్ కు పక్కలో బల్లెంలా మారే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
బ్రహ్మపుత్ర జలాలపై చైనా నియంత్రణ పెరిగిపోతుంది. ఎండాకాలంలో నీటిని మళ్లించేందుకు చైనాకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా వరద ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగునున్న ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు భారత్ - చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అందువల్ల రక్షణ పరంగాను భారత్ కు సమస్యలు పొంచి ఉన్నాయి. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రాజెక్టులో నిలువ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి చైనా వాటర్ బాంబుగా ఉపయోగించే ప్రమాదం కూడా ఉందనే నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంత ఎత్తు నుంచి నీటిని విడుదల చేస్తే అల్ల కల్లోలమే. అసోం, అరుణాచల్ వంటి రాష్ట్రాలు పూర్తిగా జల సమాధి అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.