ఈ మధ్యకాలంలో సత్వారంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో 60, 70 ఏళ్ల వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ఇప్పుడు 40 ఏళ్ళ వయసు వారిలోనూ ఇబ్బంది పెడుతోంది. నాలుగు పదులు వయసు దాటగానే కొందరికి చత్వారం (ప్రెఎస్బియోపీయా) వస్తోంది. పుస్తకాలు చదవడానికి కూడా కళ్ళజోడు అవసరం అవుతోంది. కానీ అలాంటి వారికి కళ్ళజోడు అవసరం లేకుండా చేసే చుక్కల మందు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుంది.
చుక్కల మందు
ఈ మధ్యకాలంలో సత్వారంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో 60, 70 ఏళ్ల వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ఇప్పుడు 40 ఏళ్ళ వయసు వారిలోనూ ఇబ్బంది పెడుతోంది. నాలుగు పదులు వయసు దాటగానే కొందరికి చత్వారం (ప్రెఎస్బియోపీయా) వస్తోంది. పుస్తకాలు చదవడానికి కూడా కళ్ళజోడు అవసరం అవుతోంది. కానీ అలాంటి వారికి కళ్ళజోడు అవసరం లేకుండా చేసే చుక్కల మందు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుంది. ముంబైకి చెందిన ఎన్ టాడ్ ఫార్మా కంపెనీ ప్రెస్ వూ పేరిట అభివృద్ధి చేసిన ఈ చుక్కల ముందుకు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. అక్టోబర్ మొదటి వారంలో ఈ మందును మార్కెట్లోకి తెస్తామని ఆ సంస్థ ప్రకటించింది. 40 నుంచి 55 ఏళ్ల వయసు వారిలో కొద్దిపాటి నుంచి ఒక మోస్తారు చత్వారంతో బాధపడుతున్న వారు ఈ మందును కంట్లో ఒక్క చుక్క వేస్తే 15 నిమిషాల్లోనే పని చేయడం ప్రారంభిస్తుందని సంస్థ సీఈవో నిఖిల్ వెల్లడించారు. ఒక్క చుక్క వేస్తే 6 గంటల దాకా, రెండు చుక్కలు వేస్తే మరింత ఎక్కువ సమయం పని చేస్తుందని ఆయన వివరించారు. ఈ చుక్కల మందు ధర రూ.350. నిజానికి అమెరికాలో వ్యూటీ పేరుతో 2022లోనే ఈ తరహా ఐడ్రాప్స్ అందుబాటులోకి వచ్చాయి.
ప్రెస్ వూ .. భారతదేశంలో తయారైన మొట్టమొదటి ప్రెఎస్బియోపీయా చుక్కల మందు కావడం విశేషం. ఈ చుక్కల మందు మన కన్నీటి పీహెచ్ విలువకు తగినట్టుగా వేగంగా తనను తాను సర్దుబాటు చేసుకుంటుందని, కాబట్టి దీర్ఘకాలం పాటు వాడిన ఈ మందుతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని ఎన్టాడ్ సీఈవో నిఖిల్ వెల్లడించారు. ఈ డ్రాప్స్ తయారీలో ఫైరో కార్బన్ మాలిక్యూల్ ను ఉపయోగించినట్లు తెలిపారు. అమెరికాలో సెప్సిస్ సమస్యకు దీనిని చాలాకాలంగా వాడుతున్నారు. వాస్తవానికి దీనిని రోజు వాడడం అంత మంచిది కాదు. కాబట్టి తాము దాని గాడతను తగ్గించి, మన కన్నీటి పీహెచ్ విలువకు దాదాపు దగ్గరగా తీసుకువచ్చినట్లు నిఖిల్ వెల్లడించారు. ఈ చుక్కలు వేయగానే అందులోనే ఔషధం కనుపాపలు కుచించుకుపోయేలా చేస్తుందని, దానివల్ల డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెరిగి కంటి చూపు నిశితమవుతుందని ఆయన వివరించారు. ఈ మందును కొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఇది ఎంతోమందికి మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తక్కువ వయసులోనే ఈ సమస్యతో బాధపడుతున్న ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి వారి ఇబ్బందులను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే ఈ మందును మార్కెట్లోకి అత్యంత వేగంగా తీసుకు వస్తున్నట్లు నిఖిల్ పేర్కొన్నారు.