వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ చర్యలను సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం మీడియాకు వెళ్లడించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద సీఎం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మేరకు వివరాలను తెలియజేశారు. బుడమేరు గండ్లు పూడ్చడమే తమ ముందున్న లక్ష్యమన్న చంద్రబాబు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. వరద ప్రాంతాల్లోని బాధితులు కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. ప్రజలంతా పూర్తిగా కోలుకునేంత వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ చర్యలను సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం మీడియాకు వెళ్లడించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద సీఎం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మేరకు వివరాలను తెలియజేశారు. బుడమేరు గండ్లు పూడ్చడమే తమ ముందున్న లక్ష్యమన్న చంద్రబాబు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. వరద ప్రాంతాల్లోని బాధితులు కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. ప్రజలంతా పూర్తిగా కోలుకునేంత వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. వరదలు వల్ల రాష్ట్రంలో 28 మంది చనిపోయారన్న చంద్రబాబు.. ఇళ్లల్లో సామాగ్రి నష్టానికి ఏం చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సాయంపై సమాచారం లేదని, కేంద్రానికి తామింకా ప్రాథమిక నివేదికలే పంపలేదన్నారు. వరద నష్టం అంచనాఆపై శనివారం ఉదయం ప్రాథమిక నివేదిక పంపిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. బాధితులకు అందించే సాయంపైనా కేంద్రంతో మాట్లాడుతున్నట్టు వెల్లడించారు.
ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించానన్న చంద్రబాబు.. ప్రస్తుతంపై నుంచి ప్రవాహం రావడం లేదన్నారు. ముంపు ప్రాంతాల్లో క్రమంగా నీరు తగ్గుతోందని, ముందు బుడమేరు గండ్లు పూడ్చాలన్నారు. అదే లక్ష్యంతో పని చేస్తున్నట్టు తెలిపారు. ముడమేరు మూడో గండిని పూడ్చేందుకు సైన్యం కూడా వచ్చిందన్న చంద్రబాబు.. మూడో గండిని శుక్రవారం రాత్రికి పూడ్చేలా సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు తెలిపారు. సహాయక చర్యలు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్టు వివరించారు. 149 అర్బన్, 30 రూరల్ సచివాలయాలు నుంచి పనులు చేపట్టినట్టు తెలిపారు. 3.12 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేశామని వివరించారు. 11.5 లక్షల వాటర్ బాటిళ్లు, పాలు, బిస్కెట్లు, కొవ్వొత్తులు పంపిణీ చేసినట్టు తెలిపారు. నీరు నిల్వ ఉన్న చోట తప్ప మిగిలిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరించినట్టు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించామన్న చంద్రబాబు.. వరద ప్రాంతాల్లో 72 శాతం పారిశుధ్య పనులు పూర్తి చేసినట్టు తెలిపారు. 7,100 మంది పారిశుధ్య సిబ్బంది పని చేస్తున్నారని, 1300 పీడీఎస్ వాహనాలు తిరుగుతున్నాయన్నారు. ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులతో కూడిన కిట్ అందిస్తున్నట్టు వెల్లడించారు. మూడు రోజుల్లో బాధితులు అందరికీ కిఉట్ల అందిస్తామని వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన వారికి అందించే నష్ట పరిహారంపై చర్చిస్తున్నామని వెల్లడించారు. బాధితులందరికీ న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు.