ప్రపంచ వ్యాప్తంగా గడిచిన కొన్నాళ్లుగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏపీలో కూడా ఈ కేసుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల కిందట క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ను రాష్ట్రంలో ప్రారంభించింది. ఇంటింటికి వెళ్లి ప్రాథమిక దశలో క్యాన్సర్ లక్షణాలను గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలను అందించే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పరీక్షల్లో ప్రతి వంద మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇప్పటి వరకు 53,07,448 మందికి వైద్య పరీక్షలను నిర్వహించారు. వీరిలో 52,221 మంది క్యాన్సర్ అనుమానితులుగా ఆరోగ్యశాఖ గుర్తించింది.
క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్
ప్రపంచ వ్యాప్తంగా గడిచిన కొన్నాళ్లుగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏపీలో కూడా ఈ కేసుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల కిందట క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ను రాష్ట్రంలో ప్రారంభించింది. ఇంటింటికి వెళ్లి ప్రాథమిక దశలో క్యాన్సర్ లక్షణాలను గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలను అందించే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పరీక్షల్లో ప్రతి వంద మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇప్పటి వరకు 53,07,448 మందికి వైద్య పరీక్షలను నిర్వహించారు. వీరిలో 52,221 మంది క్యాన్సర్ అనుమానితులుగా ఆరోగ్యశాఖ గుర్తించింది. రాష్ట్రంలో గడిచిన ఏడాది నవంబర్ 14 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించి అమలు చేస్తుంది. 10 నెలలపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 19,447 మందికి నోటి క్యాన్సర్, 15, 401 మందికి రొమ్ము క్యాన్సర్, 17,373 మందికి గర్భాశయ ముఖ ద్వార కాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు ఆరోగ్యశాఖ గుర్తించింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 40 వేల మందికిపైగా ఈ మహమ్మారికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ద్వారా క్యాన్సర్ చికిత్సలకు 2019-20లో రూ.217 కోట్లు ఖర్చుపెట్టగా, 2023-24 లో రూ.624 కోట్లకు పెరిగిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు వీలుగా ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 18 ఏళ్ల పైబడిన వారికి నోటి రొమ్ము క్యాన్సర్, 30 ఏళ్ళు పైబడిన మహిళలకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతోంది. విస్తృతస్థాయిలో చేపడుతున్న స్క్రీనింగ్ లో 155 మంది ప్రత్యేక వైద్యులు, 238 మంది జిల్లా ఆసుపత్రుల నిపుణులు, 394 మంది వైద్యాధికారులు, 10,032 మంది సామాజిక ఆరోగ్య అధికారులు భాగస్వాములయ్యారు. ముందుగా ఆశా కార్యకర్తలు కరపత్రాలతో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఏఎన్ఎం, సిహెచ్వోలు.. మహిళలు సర్వేకల్ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించారు. ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రం స్థాయిలో జరిపే స్క్రీనింగ్ లో వైద్యులు అనుమానిత కేసులను పరిశీలిస్తున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నిర్ధారించే చికిత్స అందిస్తున్నారు. అనుమానిత క్యాన్సర్ కేసులను ఉన్నత స్థాయి వైద్య కేంద్రాలకు రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ రోగ నిర్ధారణ కోసం వైరల్ మార్కర్స్ తోపాటు మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిర్ధారణ అయిన వారిని ప్రివెంటివ్ అకాలజీ యూనిట్ కు రిఫర్ చేస్తున్నారు. అంకాలజీ యూనిట్ స్థాయిలో సూపర్ స్పెషలిస్ట్ సమక్షంలో రోగ నిర్ధారణ చికిత్స అందిస్తున్నారు. విభిన్న దశల్లో జరిగే ఈ స్క్రీనింగ్ పరీక్షలను ప్రజలంతా ఉపయోగించుకొని క్యాన్సర్ రహిత సమాజం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి సహకారాన్ని అందించాలని ఆరోగ్యశాఖ అధికారులు పిలుపునిచ్చారు.