నేడు కెసిఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పి భేటీ.. కీలక నిర్ణయాలు ఉండేనా.!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కెసిఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పి భేటీ మంగళవారం జరగనుంది. కెసిఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరుగుతుంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దేశాన్ని దేశం చేసే అవకాశం ఉంది. గడిచిన రెండు మూడు రోజుల నుంచి కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశాల్లోనే దీనిపై ఒక స్పష్టత వస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బిఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. బడ్జెట్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎలా వ్యవహరించాలి అనేదానిపై కేసీఆర్ కీలక సూచనలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు చేసే అవకాశం ఉంది.

KCR with party leaders

పార్టీ నాయకులతో కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కెసిఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పి భేటీ మంగళవారం జరగనుంది. కెసిఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరుగుతుంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దేశాన్ని దేశం చేసే అవకాశం ఉంది. గడిచిన రెండు మూడు రోజుల నుంచి కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న ప్రచారం జరుగుతోంది.  ఈ సమావేశాల్లోనే దీనిపై ఒక స్పష్టత వస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బిఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. బడ్జెట్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎలా వ్యవహరించాలి అనేదానిపై కేసీఆర్ కీలక సూచనలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు చేసే అవకాశం ఉంది. గత బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలో ఒకరోజు మాత్రమే కెసిఆర్ సభకు హాజరయ్యారు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి ఆయన వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి కెసిఆర్ సభకు రాలేదు. కెసిఆర్ సభకు రాకపోవడం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. కెసిఆర్ సభకు రాడు అంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభకు వస్తారా రారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు కేసిఆర్ వస్తారు అంటూ ఆ పార్టీ వర్గాలు మాత్రం బలంగానే చెబుతున్నాయి. 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంతో సభలో ప్రారంభం కానున్నాయి. ఈనెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కేబినెట్ చర్చ జరిగింది. అలాగే ఉగాది నుంచి భూభారతి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఫ్యూచర్ సిటీ కోసం కొత్త బోర్డు ఏర్పాటు చేశారు. నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. కొత్త రెవిన్యూ డివిజన్లు, మండలాలకు 20017 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీడిపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్