రైతులకు అండగా నేడు బీఆర్ఎస్ మహాధర్నా.. హాజరుకానున్న కేటీఆర్

రాష్ట్రంలోని రైతు సమస్యలను పరిష్కరించాలన్న ప్రధానమైన డిమాండ్ తో భారతీయ రాష్ట్ర సమితి నిర్వహించ తలపెట్టిన మహా ధర్నా మంగళవారం జరగనుంది. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో రైతు మహా ధర్నా కార్యక్రమాన్ని భారతీయ రాష్ట్ర సమితి నిర్వహించనుంది. ఈ మహా ధర్నా కార్యక్రమానికి భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరునున్నారు. మాజీమంత్రి గుంటకంట్ల జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో ఈ మహా ధర్నాలో పాల్గొననున్నారు.

BRS Working President Ktr

భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రాష్ట్రంలోని రైతు సమస్యలను పరిష్కరించాలన్న ప్రధానమైన డిమాండ్ తో భారతీయ రాష్ట్ర సమితి నిర్వహించ తలపెట్టిన మహా ధర్నా మంగళవారం జరగనుంది. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో రైతు మహా ధర్నా కార్యక్రమాన్ని భారతీయ రాష్ట్ర సమితి నిర్వహించనుంది. ఈ మహా ధర్నా కార్యక్రమానికి భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరునున్నారు. మాజీమంత్రి గుంటకంట్ల జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో ఈ మహా ధర్నాలో పాల్గొననున్నారు. ఈనెల 12న నిర్వహించాల్సిన ఈ మహా ధర్నాను సంక్రాంతి పండగ కారణంగా వాయిదా వేశారు. ఈ మహా ధర్నాను వాయిదా వేసిన అనంతరం ఈనెల 21న నిర్వహించాలని తొలుత భావించారు. ఆరోజు నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో మంగళవారం నిర్వహించేందుకు భారతీయ రాష్ట్ర సమితి నేతలు అనుమతి తీసుకున్నారు. ఈనెల 21న పోలీసులు అనుమతి నిరాకరించడానికి ట్రాఫిక్ సమస్యలు, గ్రామ సభలు కారణంగా వెల్లడించారు.

అయితే భారతీయ రాష్ట్ర సంతు నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో 27న ధర్నాకు అనుమతి ఇచ్చారు. అయితే పార్టీ నాయకులు ధర్నా నిర్వహించేందుకు పోలీసులు అనుమతి కోరగా 1500 మంది భాగస్వామ్యంతో ర్యాలీకి అనుమతి ఇచ్చారు. ఈ ర్యాలీ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు సాగి గడియారం సెంటర్లో మహా ధర్నా నిర్వహించడం ద్వారా ముగియనుంది. పోలీసులు ఈ ధర్నా కోసం ఉదయం 11 గంటల నుంచి ఈ మధ్యాహ్నం రెండు గంటల వరకు అంటే మూడు గంటల సమయాన్ని మాత్రమే అనుమతి ఇచ్చారు. దీనికి అనుగుణంగా భారతీయ రాష్ట్ర సమితి నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ మహా ధర్నాలో రైతు సమస్యలను ప్రస్తావించడంతోపాటు రైతుల పక్షాన భారతీయ రాష్ట్ర సమితి తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ ఈ సందర్భంగా వివరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు సమస్యలపై ప్రభుత్వానికి తీర్మానాలను అందించడమే ఈ మహా ధర్నా ముఖ్య ఉద్దేశంగా భారతీయ రాష్ట్ర సమితి నాయకులు చెబుతున్నారు. దీంతో ప్రజల దృష్టి నల్లగొండ పట్టణంలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న మహా ధర్నాపై నెలకొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్