సరోగసిలో పుట్టిన బిడ్డపై బాంబే హైకోర్టు కీలక తీర్పు.. తీర్పులో ఏముందంటే..?

బాంబే హైకోర్టు కీలక తీర్పించింది. సరోగసిలో పుట్టిన బిడ్డపై ఎవరికి హక్కులు ఉంటాయన్న దానిపై బాంబే హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ తీర్పుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అండ/వీర్య దాతకు.. పుట్టే బిడ్డపై ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉండవని ఆ బిడ్డకు తాము బైలాజికల్ పేరెంట్స్ అని చెప్పుకోవడానికి అవకాశం లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.

bombay high court

బాంబే హైకోర్టు

బాంబే హైకోర్టు కీలక తీర్పించింది. సరోగసిలో పుట్టిన బిడ్డపై ఎవరికి హక్కులు ఉంటాయన్న దానిపై బాంబే హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ తీర్పుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అండ/వీర్య దాతకు.. పుట్టే బిడ్డపై ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉండవని ఆ బిడ్డకు తాము బైలాజికల్ పేరెంట్స్ అని చెప్పుకోవడానికి అవకాశం లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ (42) పెళ్లయి చాలా కాలమైనా బిడ్డలు లేకపోవడంతో అద్దె గర్భం ద్వారా పిల్లలను పొందాలని భావించింది. తన చెల్లి అండం, తన భర్త వీర్యంతో సరోగసి విధానంలో 2019లో ఆగస్టులో ఇద్దరు కవల ఆడపిల్లలను పొందింది. అదే ఏడాది ఏప్రిల్ లోనే ఆమె చెల్లెలు భర్త, కుమార్తె రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2021 మార్చిలో భర్త ఆమెకు విడాకులు ఇచ్చి ఆమె చెల్లెలు, ఇద్దరు కవలలతో కలిసి వేరే ఫ్లాట్లో నివసించడం ప్రారంభించాడు.

రెండేళ్లపాటు మాతృత్వ మాధుర్యాన్ని అనుభవించిన ఆ మహిళ ఆ పిల్లలను చూసే అవకాశం కూడా తనకు కల్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టును ఆశ్రయించింది. తనకు ఉన్న విజిటేషన్ రైట్స్ కాపాడాలని కోరింది. కింది కోర్టు ఆమె వినతిని తిరస్కరించగా ఆమె బాంబే హైకోర్టులో అప్పీల్ చేసింది. అయితే అండదానం చేసినందున తానే అసలైన తల్లినని ఆమె చెల్లెలు కోర్టులో వాదించింది. ఆమె భర్త కూడా ఆమెనే బలపరిచాడు. అయితే, అండం ఆమెదే అయిన ఆమె స్వచ్ఛంద దాత అని, ఆ బిడ్డలను కడుపున మోసింది ఆమె కాదు కాబట్టి చట్ట ప్రకారం ఆమెను తల్లిగా పరిగణించకూడదని పిటిషన్ తరఫు లాయర్ వాదించారు. వాదనలు విన్న జస్టిస్ జాదవ్ మంగళవారం తీర్పు ఇచ్చారు. సరోగసి ద్వారా ఆ పిల్లల పుట్టింది 2018లో కాబట్టి 2021 నాటికి సరోగసి నియంత్రణ చట్టం ఈ కేసులో వర్తించదని, 2005 భారత వైద్య పరిశోధనా మండలి మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. వాటి ప్రకారం వీర్యదాత గానీ, అండదాతగానీ ఎన్నటికీ శిశువులపై చట్టపరమైన హక్కును ప్రకటించుకోలేరని తేల్చి చెప్పారు. అండం ఇచ్చిన తల్లి జనిటిక్ మదర్ మాత్రమే అవుతుందని స్పష్టం చేశారు. ప్రతి వారాంతంలో మూడు గంటల పాటు పిల్లలతో గడిపేందుకు ఆ తల్లికి (పిటిషన్ వేసిన మహిళకు) అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. ఈ తీర్పుతో సరోగసి విధానంలో బిడ్డను పొందిన వ్యవహారంలో తల్లి ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం లభించినట్టు అయిందని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఈ కేసులో అనేక అంశాలు ఉన్నాయని చెబుతున్నారు. 2021 సరోగసి నియంత్రణ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో.. ఈ చట్టం ప్రకారం అయితే మరో విధమైన తీర్పు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్