గడచిన కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పై రచ్చ జరుగుతుంది. వివిధ యాప్లను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ వ్యవహారం తాజాగా సినీనటులపైకి వచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారంటూ సినీ నటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై సైబర్ క్రైమ్ విభాగానికి ఆన్లైన్లో న్యాయవాది అమ్మనేని రామారావు ఫిర్యాదు చేశారు. దీంతో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో ఇప్పటివరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, చిన్న నటులపై మాత్రమే కేసులు నమోదవుతూ వచ్చాయి. తాజా ఫిర్యాదుతో అగ్ర నటులు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో చిక్కుకున్నట్టు అయిందని పలువురు పేర్కొంటున్నారు. నందమూరి బాలకృష్ణ, గోపికృష్ణ, ప్రభాస్ చైనీస్ బెట్టింగ్ యాప్ అయినా ఫన్ -88 ను ప్రమోట్ చేశారని ఫిర్యాదులు ఆయన పేర్కొన్నారు.
ప్రతీకాత్మక చిత్రం
గడచిన కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పై రచ్చ జరుగుతుంది. వివిధ యాప్లను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ వ్యవహారం తాజాగా సినీనటులపైకి వచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారంటూ సినీ నటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై సైబర్ క్రైమ్ విభాగానికి ఆన్లైన్లో న్యాయవాది అమ్మనేని రామారావు ఫిర్యాదు చేశారు. దీంతో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో ఇప్పటివరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, చిన్న నటులపై మాత్రమే కేసులు నమోదవుతూ వచ్చాయి. తాజా ఫిర్యాదుతో అగ్ర నటులు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో చిక్కుకున్నట్టు అయిందని పలువురు పేర్కొంటున్నారు. నందమూరి బాలకృష్ణ, గోపికృష్ణ, ప్రభాస్ చైనీస్ బెట్టింగ్ యాప్ అయినా ఫన్ -88 ను ప్రమోట్ చేశారని ఫిర్యాదులు ఆయన పేర్కొన్నారు. యాప్ నిర్వాహకులు మ్యూల్ ఆధార్ నెంబర్లతో వారికి తెలియకుండానే ఖాతాలు ద్వారా కోట్లాది రూపాయలను చైనాకు తరలించారని వివరించారు. దేశ భద్రతకు సవాల్ గా మారిన ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని, దాన్ని వెంటనే బ్లాక్ చేయాలని రామారావు ఫిర్యాదుల కోరారు. బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్లపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లు, సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఇప్పటిదాకా 385 కేసులో నమోదు అయినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో పాల్గొన్న వారికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు ముందు భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని ఉన్నదా అధికారుల నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్ వలలో చిక్కుకుని, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న కేసులను రీఓపెన్ చేయాలని సూచించినట్లు తెలిసింది.
ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ లో అధిక శాపం వాటా చైనా కంపెనీలకే వెళుతున్నట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ కు సంబంధించి ప్రభుత్వ అనుమతులు ఉన్న భారతీయ కంపెనీలో 28 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బెట్టింగ్ పై నిషేధం లేని రాష్ట్రాల్లోనే ఆయా యాప్స్, వెబ్సైట్లో ద్వారా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. కానీ చాలా సంస్థలు ఆయా నిబంధనలు పాటించడం లేదు. జీఎస్టీ చెల్లించని గేమింగ్ యాప్స్ సంస్థలపై ఇటీవల జీఎస్టీ టాక్స్ ఇంటెలిజెన్స్ అధికారులు కొరడా ఝలిపించారు. 357 వెబ్సైట్లను బ్లాక్ చేయడంతో పాటు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో జియో ఫెన్సింగ్ టెక్నాలజీ ద్వారా బెట్టింగ్ సైట్లు యాక్సెస్ కాకుండా అడ్డుకోవడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 108 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేయడంతో పాటు 133 భారతీయ బెట్టింగ్ ప్లాట్ఫారం సంస్థలకు నోటీసులను జారీ చేశారు. బెట్టింగులు వల్ల జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు ఎంతోమంది ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ ను అరికట్టడం ద్వారా యువతను పక్కదారి పట్టించకుండా కాపాడవచ్చు అన్న ఉద్దేశంతోనే పోలీసులు పెద్ద ఎత్తున ఈ వ్యవహారంపై విచారణ సాగిస్తున్నారు.