పసిడి రుణాలు చెల్లింపుకు ఈఎంఐ.. త్వరలో ప్రవేశపెట్టే యోచనలో బ్యాంకులు

బంగారం తాకట్టుపై తీసుకునే రుణాలను నెలవారి వాయిదా (ఈఎంఐ)లో చెల్లించే అవకాశం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ రుణాలు తీసుకోవాలంటే బ్యాంకుల నుంచి సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అదే సమయంలో క్రెడిట్ స్కోర్, నెలవారి ఆదాయం వంటి వివరాలను పరిశీలించిన తరువాతే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి.

gold loans

బంగారం రుణాలు

బంగారం తాకట్టుపై తీసుకునే రుణాలను నెలవారి వాయిదా (ఈఎంఐ)లో చెల్లించే అవకాశం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ రుణాలు తీసుకోవాలంటే బ్యాంకుల నుంచి సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అదే సమయంలో క్రెడిట్ స్కోర్, నెలవారి ఆదాయం వంటి వివరాలను పరిశీలించిన తరువాతే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. అయితే ఇలాంటి చిక్కులు లేకుండా తమ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు నెలవారి వాయిదాలలో చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బిఎఫ్సి) సన్నాహాలు చేస్తున్నాయి. ఎప్పటి వరకు బంగారం తాకట్టుపై తీసుకునే రుణాలు వడ్డీ మాత్రమే నెల నెల చెల్లిస్తే సరిపోతుంది. అదికూడా తప్పనిసరి కాదు. రుణ కాల పరిమితి ముగిసేనాటికి అసలు, వడ్డీ ఒకేసారి చెల్లించి కూడా కుదువ పెట్టిన బంగారాన్ని విడిపించుకోవచ్చు. కానీ కొందరు రుణగ్రహీతలు తీసుకున్న అప్పును మొత్తం ఒకేసారి చెల్లించడం భారమై తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ రుణాన్ని ఒకేసారి తీర్చలేని వారికి ఈ విధానం మేలు చేస్తుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మాదిరిగానే తాకట్టు పెట్టి తీసుకున్న అప్పును కూడా అసలు, వడ్డీ కలిపి నెల వారి వాయిదా పద్ధతుల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాలని బ్యాంకులు, ఎన్బిఎఫ్సీలు యోచిస్తున్నాయి. అలాగే బంగారం తాకట్టుపై టర్మ్ లోన్ మంజూరు ఆలోచన కూడా ఉన్నట్లు తెలిసింది. 

పసిడి రుణాల మంజూరులో బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు అనుసరిస్తున్న అనుచిత విధానాలపై ఈ ఏడాది సెప్టెంబర్ 30న భారతీయ రిజర్వు బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రుణాల సోర్సింగ్, తాకట్టు బంగారం విలువ మదింపు, తనిఖీ ప్రక్రియ, పర్యవేక్షణ, బంగారం వేలం, లోన్ టు వ్యాల్యూ రేషియో, రిస్క్ వెయిటేజీ అంశాల్లో లోపాలను ఎత్తి చూపింది. అంతేకాకుండా రుణ గ్రహీతలు తాకట్టు పెట్టే బంగారంపైనే ఆధారపడకుండా వారి తిరిగి చెల్లింపులు సామర్థ్యాన్ని పరిశీలించాలని రుణ దాతలను ఆర్బిఐ ఆదేశించింది. పాక్షిక చెల్లింపులపై రుణ కాల పరిమితి రెన్యువల్ ను ఆర్బిఐ తప్పు పట్టింది. ఈ నేపథ్యంలోనే బంగారం తనఖా రుణాలకు నిర్దేశిత గడువుతో కూడిన ఈఎంఐ ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నామని బ్యాంకింగ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసినా ద్వితీయ త్రైమాసికం నాటికి బ్యాంకుల బంగారం తనఖా రుణాల మంజూరు వార్షిక ప్రాతిపదికన 51 శాతం వృద్ధితో 1.4 లక్షల కోట్లకు చేరుకుంది. గడిచిన ఏడాదిలో ఇదే కాలానికి ఈ రుణాలు వృద్ధి 14.6 శాతంగా నమోదయింది. గడిచిన ఏడాది కాలంలో బంగారం ధర భారీగా పెరగడంతో ఈ విభాగ రుణాలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక ప్రకారం ఈ ఏప్రిల్, ఆగస్టు మధ్య కాలంలో బ్యాంకుల బంగారం రుణాల మంజూరు 37 శాతం వృద్ధి చెందగా, గోల్డ్ లోన్ కంపెనీల రుణ ఆస్తులు 11 శాతం పెరిగినట్లు వెల్లడించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్