కుంభమేళాలో బాలయ్య షూటింగ్‌ షురూ.. ఆ చిత్రానికి సీక్వెల్‌ ప్రారంభం

అఖండ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్‌-2 రాబోతోంది. అఖండ్‌-2 చిత్రం షూటింగ్‌ ప్రయోగ్‌ రాజ్‌లో సోమవారం ప్రారంభమైన కుంభమేళాలో ప్రారంభమైంది. భోయపాటి శ్రీను డైరక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కుంభమేళాలో ప్రారంభించారు. మూవీ యూనిట్‌ చాలా కీలకమైన సన్నివేశాలను మహా కుంభమేళాలో చిత్రీకరిస్తోంది. ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

Nandamuri Balakrishna in Akhand

అఖండ్‌లో నందమూరి బాలకృష్ణ

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయోగ్‌ రాజ్‌లో అతిపెద్ద హిందూ పండగ మహా కుంభమేళా సోమవారం నుంచి ప్రారంభమైంది. సోమవారం పుణ్య స్నానాలను ఆచరించడం ద్వారా ఈ కుంభ మేళా ప్రారంభమైంది. సోమవారం నుంచి 40 రోజులపాటు జరగనున్న కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి సుమారు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. తొలిరోజే అనేక ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులతో ప్రయోగ్‌ రాజ్‌ కిక్కిరిసింది. ఎక్కడ చూసినా లక్షలాది మంది భక్తులు కనిపించాయి. అటువంటి కుంభమేళాలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ్‌ చిత్రం అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాలకృష్ణ కెపాసిటినీ, నట విశ్వ రూపాన్ని తెలుగు సినీ అభిమానులకు మరోసారి చూపించినట్టు అయింది.

అటువంటి అఖండ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్‌-2 రాబోతోంది. అఖండ్‌-2 చిత్రం షూటింగ్‌ ప్రయోగ్‌ రాజ్‌లో సోమవారం ప్రారంభమైన కుంభమేళాలో ప్రారంభమైంది. భోయపాటి శ్రీను డైరక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కుంభమేళాలో ప్రారంభించారు. మూవీ యూనిట్‌ చాలా కీలకమైన సన్నివేశాలను మహా కుంభమేళాలో చిత్రీకరిస్తోంది. ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. పార్ట్‌-1 అద్భుత విజయాన్ని సాధించడంతో పార్ట్‌-2పై అంతా ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే బోయపాటి శ్రీను అఖండ్‌-2ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్‌ ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌ సి రాంప్రసాద్‌, ఎడిటర్‌ తమ్మిరాజు, ఆర్ట్‌ డైరక్టర్‌ ఎస్‌ఎస్‌ ప్రకాష్‌తో సహా అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 25న దసరా కానుకగా సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అందుకు అనుగుణంగానే దర్శకుడు సినిమాకు హైప్‌ ఇచ్చేలా కుంభమేళాలో చిత్రీకరణ ప్రారంభించడంతో సినిమా పట్ల మరింత ఆసక్తి పెరిగింది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్