గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవంతో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ కొద్దిరోజుల నుంచి ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తుంది. అయితే ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీ దీనిపై కూటమి ప్రభుత్వాన్ని ఒకవైపు డిమాండ్ చేస్తూనే.. మరోవైపు హైకోర్టుకు కూడా జగన్ వెళ్లారు. కొద్ది రోజుల కిందట అసెంబ్లీకి వచ్చిన జగన్ మరోసారి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొద్ది నిమిషాల పాటు అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవంతో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ కొద్దిరోజుల నుంచి ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తుంది. అయితే ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీ దీనిపై కూటమి ప్రభుత్వాన్ని ఒకవైపు డిమాండ్ చేస్తూనే.. మరోవైపు హైకోర్టుకు కూడా జగన్ వెళ్లారు. కొద్ది రోజుల కిందట అసెంబ్లీకి వచ్చిన జగన్ మరోసారి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొద్ది నిమిషాల పాటు అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలపై కీలకమైన ప్రకటన చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ప్రతిపక్ష హోదాపై వైయస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారని స్పీకర్ వెల్లడించారు. ఇందులో సభాపతిని, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చాలని పేర్కొన్నారు. లోక్సభలో టిడిపి నేత ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారనేది అవాస్తమని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారానికి తరలించేందుకు రూలింగ్ ఇస్తున్నట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. బెదిరింపులు, అభియోగాలతో జగన్ తనకు లేఖ రాసినట్లు అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
ప్రతిపక్షవాద ఇవ్వాలంటూ అవాకులు, చెవాకులు పేలారని పేర్కొన్నారు. స్పీకర్ కు హైకోర్టు సమన్లు ఇచ్చినట్టుగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. స్పీకర్ కు దురుద్దేశాలను ఆపాదించడం సభా హక్కుల ఉల్లంగనే అవుతుందని వెల్లడించారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ ను క్షమిస్తున్న అని పేర్కొన్న అయ్యన్నపాత్రుడు.. ఇకముందు కూడా జగన్ ఇలాగే వ్యవహరిస్తే ఏం చేయాలో సభకే వదిలిపెడుతున్నానని పేర్కొన్నారు. 10% సీట్లు రాకుండా గతంలో ఎవరికీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఈ సందర్భంగా స్పీకర్ గుర్తు చేశారు. కనీసం 18 సీట్లు రాకుండా ప్రతిపక్ష హోదా రాదని, ఇది జగన్కు కూడా తెలుసని స్పష్టం చేశారు. గతంలోనూ ఎవ్వరికీ ఇవ్వలేదని తెలుసుకోవడం జగన్ ఇలా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదాపై జగన్ హైకోర్టుకు కూడా వెళ్లారని.. జగన్ పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా అనే దశలోనే ఉందన్నారు. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు వేచి చూద్దామనుకున్నా కానీ కొన్ని రోజులుగా జగన్ సహా వైసిపి సభ్యులు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయన్నారు. తప్పుడు ప్రచారానికి తరలించేందుకే రూలింగ్ ఇస్తున్నట్టు స్పీకర్ వెల్లడించారు. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు అని.. సభకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు ప్రజలు తమను ఎందుకు గెలిపించారో ఆలోచించాలన్నారు. సభకు రాకుంటే తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎవరు లేవనెత్తుతారని స్పష్టం చేశారు. కాబట్టి ఇవన్నీ గ్రహించి సభకు రావాలని వైసీపీ సభ్యులను స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. స్పీకర్ తాజా ప్రకటనపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.